డేటాగ్రిడ్ కేసులో తన పేరు తీసేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సీఈవో..!

తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన డేటా చోరీ కేసులో తన పేరును తొలగించాలంటూ ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండో తేదీన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఐటీ గ్రిడ్‌పై దాడి చేశారు. సోదాలు చేసి కంపెనీలో ఉన్న అన్ని సీపీయూ, ట్యాబ్, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత అశోక్‌ను పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. రెండో తేదీన కేసు నమోదు చేస్తే మూడో తేదీనే ఆయన పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అశోక్‌కు నోటీసులు జారీ చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన తనకు ఈ కేసుతో సంబంధమే లేదని తన పేరును పోలీసులు అనవసరంగా ఇరికించారంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది శనివారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఐటి గ్రిడ్ సీఈవో వ్యూహాత్మకంగానే తన పేరు అనవసరంగా ఇరికించారని.. తీసేయాలని పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆయనను నిందితునిగా పేర్కొనాలంటే ముందుగా ఆయన చేసిన నేరమేమిటో పోలీసులు కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. ఆయనపై కేసు ఎందుకు పెట్టారో పోలీసులు చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. మొదట్లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన గుప్తమైన సమాచారం చోరీ చేశారని పోలీసులు ప్రకటన చేశారు. తమ సమచారం ఏమీ పోలేదనీ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత ఐటీ గ్రిడ్ సర్వే చేసి ఓట్లు తీసేస్తోందని మరో కేసులో చెప్పుకొచ్చారు. కానీ ఈ నేరాన్ని ధృవీకరించాల్సింది ఈసీ. ఈసీ మటుకు ఇతర వ్యక్తులు ఓట్లు తీసేసే అవకాశం లేదని చెబుతోంది. ఇప్పుడు పోలీసులు తాజాగా తెలంగాణ వ్యక్తుల వ్యక్తిగత సమాచారం ఉందని చెబుతున్నారు. అది స్వచ్చందంగా ఇచ్చిన సమాచారం అని ఐటీ గ్రిడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాము ఇంకా సర్వర్ల నుంచి చాలాడేటా రాబట్టాల్సి ఉందని అశోక్ అమెరికాలో ఉన్నా అమరావతిలో ఉన్నా పట్టుకుంటామని సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర చెప్పుకొచ్చారు.

ఈ తరణంలో అసలు కేసేమిటి అన్నది హైకోర్టులో విచారణకు రావాలన్న ఉద్దేశంతోనే తన పేరును కేసు నుంచి తీసేయాలని వ్యూహాత్మకంగా అశోక్ పిటిషన్ వేసినట్లు చెబుతున్నారు. మరో వైపు సిట్ కార్యాలయాన్ని డీజీపీ ఆఫీస్ నుంచి గోషామహల్‌కు తరలించారు. స్టీఫెన్ రవీంద్ర బృందం గోషామహల్ నుంచే విచారణ చేపట్టనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close