ఆస్తులేమీ లేవని అఫిడవిట్..! కేఏ పాల్ నామినేషన్ ఆమోదం..!

నర్సాపురం నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్లకు ఆమోదం లభించింది. మూడు రోజుల కిందట.. ఏ పత్రాలు ఇవ్వకుండా నామినేషన్‌లు దాఖలు చేయడంతో.. ఆయన సీరియస్‌గా లేరన్న ప్రచారం జరిగింది. అయితే.. నామినేషన్లకు చివరి రోజు అయిన సోమవారం మాత్రం.. నర్సాపురం లోక్‌సభ స్థానానికి, అదే స్థానం నుంచి అసెంబ్లీ స్థానానికి అన్ని వివరాలతో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా వాటిని రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.

భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్‌ అధికారి నామినేషన్ పత్రాలను తీసుకోలేదు. నర్సాపురం బరిలో ఉండటం మాత్రం ఖాయం అయింది.

ఎన్నికల అఫిడవిట్‌లో అత్యంత కీలకమైన ఆస్తుల ప్రకటన విషయంలో.. కేఏ పాల్… ఖాళీ పత్రమే ఇచ్చారు. దానికి ఆయన … తనకు ఎలాంటి స్థిర, చరాస్తులు లేవని ప్రకటన చేశారు. తన ఆస్తులన్నీ.. స్వచ్చంద సేవా సంస్థలకు రాసిచ్చేశానని ప్రకటించారు. విదేశీ ఆస్తులను కూడా ప్రకటించాల్సి ఉంది. విదేశాల్లో కూడా.. తనకు ఎలాంటి ఆస్తులు లేవని.. కేఏ పాల్ స్పష్టం చేశారు. ఇది స్వచ్చందంగా ఇచ్చిన ధృవీకరణ పత్రం. ఆయన పేరు మీద ఫలానా ఆస్తులు ఉన్నాయని.. ఎవరైనా గుర్తించి ఫిర్యాదు చేస్తే పోటీకి అనుర్హుడయ్యే అవకాశం ఉంది.

మరో వైపు కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి..తరపున దాదాపుగా వంద నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని చివరి క్షణంలో.. ఇతర పార్టీలకు చెందిన నేతలు వ్యూహాత్మకంగా… నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన ముఖ్యనేత పేరును పోలినట్లు ఉండేవారి పేర్లతో బీఫాం తీసుకుని నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో కొంత మంది అభ్యర్థులకు దడ ప్రారంభమయింది. ఫ్యాన్ గుర్తు, హెలికాఫ్టర్ రెక్కల గుర్తు దాదాపు ఒక్కటిగాఉండటంతో.. గ్రామాల్లో వృద్ధులు.. పొరపాటున కొన్ని ఓట్లు తేడాగా వేసినా.. ఇబ్బంది పడతామని టెన్షన్‌కు గురవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close