బండారుని నిందించలేము: పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక విలేఖరి “యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ మరణించినపుడు అన్ని రాజకీయ పార్టీల నేతలు వచ్చేరు కానీ మీరు మాత్రం రాలేదు. కనీసం స్పందించలేదు. ఎందుకు?” అని ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ జవాబు చెపుతూ “రోహిత్ వంటి చాలా ప్రతిభ గల విద్యార్ధి మరణించడం నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులే కులాలను ప్రోత్సహించడం, విద్యార్ధులు కూడా ఆ ప్రభావానికి గురవడం మనం చాలా కాలంగా చూస్తున్నాము. ఆ కారణంగానే విద్యార్ధుల మధ్య గొడవలు, వివక్షవంటివి తలెత్తుతున్నాయి. రోహిత్ మరణానికి కూడా అదే కారణం కావడం చాలా బాధ కలిగించింది. రాజకీయ నేతలు అందరూ వచ్చి అతని మరణాన్ని కూడా రాజకీయం చేసారు. యూనివర్సిటికి సంబంధించిన ఒక సమస్యను జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళారు. వారిలో నేను కూడా ఒకడినవడం ఇష్టం లేకనే నేను రాలేదు. మాట్లాడలేదు. కానీ దానర్ధం రోహిత్ మరణానికి నేను బాధపడలేదని కాదు,” అని అన్నారు.

“రోహిత్ మృతికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ వ్రాయడమే కారణం కదా?” అని ఒక విలేఖరి ప్రశ్నించినపుడు, “ఈ సమస్య అంతకంటే చాలా కాలం ముందు నుంచే యూనివర్సిటీలో కొనసాగుతోంది. కనుక బండారు దత్తాత్రేయను నిందించలేము,” అని పవన్ కళ్యాణ్ జవాబిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close