నాగ్ ఇంట్లో కుక్క‌కి తెలిసింది గానీ…

స‌మంత – నాగ చైత‌న్య‌.. వెండి తెర‌పైనే కాదు, నిజ జీవితంలోనూ మాయ‌గాళ్లు. ఈ విష‌యాన్ని నాగార్జునే ఒప్పుకున్నారు. ‘మ‌జిలీ’ ప్రీ రిలీజ్ వేడుక‌కు నాగార్జున ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న కొడుకు, కోడ‌ళ్ల‌పై ఉన్న ప్రేమ‌ని అభిమాల‌ను స‌మ‌క్షంలో వ్య‌క్త‌ప‌రిచారు. ఏం మాయ చేశావె చూశాక‌, ఈ జంట బాగుంద‌ని అనుకున్నాన‌ని, కానీ తెర వెనుక వాళ్ల‌ద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ న‌డుస్తుంద‌ని అనుకోలేద‌ని, మ‌నంలో క‌ల‌సి న‌టించినా క‌నిపెట్ట‌లేక‌పోయాయ‌ని, అంత‌లా మాయ చేశార‌ని చెప్పుకొచ్చారు నాగ్. అంతేకాదు.. స‌మంత తొలిసారి తన ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు ఇంట్లో ఉన్న కుక్క ప‌రిగెట్టుకుంటూ స‌మంత ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింద‌ని, ఇంట్లో కుక్క‌కి కూడా తెలిసిన విష‌యం త‌న‌కే తెలియ‌న‌లేద‌ని చ‌మ‌త్క‌రించారు నాగ్‌.

ఈ సినిమాలోని ఓ డైలాగ్ విని మ‌న‌సు జివ్వుమంద‌ట‌. చాలా బాధ ప‌డ్డార‌ట‌. ”వెధ‌వ‌ల‌కెప్పుడూ మంచి అమ్మాయిలే దొరుకుతారు` అనే డైలాగ్ విన్న‌ప్పుడు కోపం వ‌చ్చింది. ఓ నాన్న‌లా నాకెలా ఉంటుందో చెప్పండి. మా మంచి అబ్బాయికి మంచి కోడ‌లు దొరికింది” అని చెప్పుకొచ్చారు నాగార్జున‌. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని, ఆ కాన్ఫిడెన్స్ టీమ్ లో తాను చూశాన‌ని, ట్రైల‌ర్ చూస్తున్న‌ప్పుడే రెండు సార్లు క‌ళ్ల వెంట నీళ్లు తిరిగాయ‌ని, సినిమా చూశాక ఎలా ఉంటుందో అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close