తనను చూసి ఓటేయమంటున్న చంద్రబాబు..!

ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార శైలి మారుస్తూ వచ్చారు. ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి… ఇప్పుడు…తనను చూసి ఓటేయమని పిలుపునిస్తున్నారు. దీనికి కారణం.. అధికారంలో ఉన్నప్పుడు.. పార్టీ నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యవహరించిన తీరుతో.. కింది స్థాయిలో ఉండే అసంతృప్తి ఓట్ల రూపంలో వస్తుందేమోనన్న ఆందోళన చంద్రబాబులో రావడమేనంటున్నారు. ఎంత లేదన్నా.. అధికారంలో ఉన్న పార్టీకి.. ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత… అధికార పార్టీ నేతల పేరుతో… కింది స్థాయి నేతలు చేసే హడావుడి వల్లే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం టీడీపీ అధినేతగా చంద్రబాబుకు తెలియనిది కాదు. కానీ.. ముందు నుంచి ఈ మాట చెబితే.. వ్యతిరేకత ఎక్కువ ఉందనే ప్రచారం జరిగే అవకాశం ఉంది.

అందుకే…ఓటింగ్ .. మూడు రోజులు ఉందనగా.. కింది స్థాయి నేతలు చేసిన పనుల వల్ల వ్యతిరేకతతో టీడీపీకి ఓటు వేయకుండా ఉండవద్దని..ఆయన ప్రజలకు సందేశం పంపదల్చుకున్నారు. అందుకోసమే… తనను చూసి ఓటేయండని పిలుపునిస్తున్నారు., రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని చెబుతున్నారు. చంద్రబాబు ఏ విషయంపైనైనా … టైమింగ్‌తో స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తారు. ఇప్పుడు… అధికార పార్టీపై క్షేత్ర స్థాయిలో ఉండే అసంతృప్తిని కూడా… దూరం చేయడానికి.. వ్యూహాత్మకంగా.. తననే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.

మరి చంద్రబాబును… సామాజికవర్గం, ఇతర కోణాల్లో వ్యతిరేకించేవారూ చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం కూడా.. చంద్రబాబు… ఓ ప్రత్యేకమైన వ్యూహం సిద్ధం చేసుకున్నారు. తాను శాశ్వతం కాదని.. రాష్ట్రం శాశ్వతమని.. గుర్తు చేస్తున్నారు. రాష్ట్రం కోసం ఆలోచంచి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఈ అంశం ప్రజల్లో కూడా… ఆలోచన రేకెత్తించేలా ఉంది. మొత్తానికి తన నలభై ఏళ్ల అనుభవంతో చంద్రబాబు.. వ్యూహాత్మకంగా.. ప్రచారశైలిని..మార్చుకుంటూ.. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close