చంద్రబాబు లాస్ట్ మినిట్ సిక్స్..! కోటి మంది మహిళలు, 30 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బు..!

పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించలేని దెబ్బకొట్టింది. రాష్ట్రంలో దాదాపుగా కోటి మంది ఉన్న డ్వాక్రా మహిళలకు.. ఒక్కొక్కరికి రూ. నాలుగు వేలు అందేలా చేసింది. వారి అకౌంట్లలో శనివారమే నగదు జమ చేసింది. వారంతా… ఇవాళ నుంచి..బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవడం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న బ్యాంకు శాఖల వద్ద.. ముఖ్యంగా.. పొదులు మహిళా గ్రూపుల ఖాతాలు ఉన్న బ్యాంకుల మహిళల క్యూలు పెద్ద ఎత్తున కనిపించాయి. పోలింగ్ తేదీ లోపు అందరూ నగదు తీసుకునేలా… టీడీపీ శ్రేణులు కూడా.. ఆయా డ్వాక్రా మహిళలను తొందర పెడుతున్నాయి. ఇప్పటికే.. పసుపు – కుంకుమ కింద… రెండు విడతలుగా ఆరువేలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. మూడో విడతగా రూ. నాలుగు వేలు మంజూరు చేసింది. ఈ పథకాన్ని… ప్రతీ ఏటా కొనసాగిస్తామని.. ఏడాదికి రూ. పది వేలు.. డ్వాక్రా మహిళలకు.. ఇస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు.

నగదు సాయం పొందుతున్న మహిళల క్యూలు.. టీడీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. మరో వైపు… రైతు రుణమాఫీ పథకం కింద.. 4వ విడత రుణమాఫీ కోసం రూ.3, 900 కోట్లు విడుదల చేశారు. 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.39 వేల చొప్పున జమ చేశారు. రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంక్‌కు వెళ్లాలని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సూచించారు. ఐదో విడత కూడా.. ఏడాదికి 10 శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామన్నారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే .. వడ్డీతో సహా తుది విడత బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. మొత్తం 58.32 లక్షల మంది రైతుల్లో .. 23.76 లక్షల మందికి తొలి విడతలోనే రుణమాఫీ అయిందని.. మిగిలిన వారికి… వచ్చే నెలలో మిగిలిన వాయిదా కూడా పూర్తి చేస్తామన్నారు. ఖరీఫ్‌ లోగా అన్నదాత సుఖీభవ కింద.. ఇవ్వాల్సిన మిగతా అమౌంట్‌ను కూడా రైతుల్లో ఖాతాల్లో వేస్తామని కుటుంబరావు ప్రకటించారు. నేరుగా.. ప్రభుత్వ సొమ్ముతోనే .. టీడీపీ సర్కార్ ఓట్లు కొనుగోలు చేస్తోందనే… విమర్శలు వైసీపీ నేతల నుంచి వస్తున్నాయి. అయితే.. వారి హామీలు కూడా.. అవే కదా.. అని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

వారు అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు.. మేము అధికారంలో ఉండి.. ఇచ్చేస్తున్నామని అంటున్నారు. డబ్బులు తీసుకున్నవారిలో… ప్రభుత్వంపై కృతజ్ఞతాభావం ఉంటుందని.. కచ్చితంగా తమకే ఓటు వేస్తారని.. టీడీపీ వర్గాలు ఆశ పడుతున్నాయి. కానీ.. ఐదేళ్ల పాలనలో మహిళలు చాలా కష్టాలు పడ్డారని… వారందరూ… డబ్బులు తీసుకున్నా.. తమకే ఓట్లేస్తారని.. వైసీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close