ఇంతదాకా వచ్చాక చట్టం మార్చమంటే ఎలా?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌కార్పొరేషన్‌కు సంబంధించి ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది. మూడురోజుల్లో ఫలితాలు వచ్చేస్తాయి. కొత్త మేయర్‌ ఎవరు అవుతారో తేలిపోతుంది. రాష్ట్రంలో కీలకమైన రాజధాన నగర పాలిక ఎన్నికల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేస్తున్నట్లే. ఇంతవరకూ వచ్చిన తర్వాత.. వామపక్షాల నేతలు ఇప్పుడు ఏకంగా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టంలోనే మార్పుచేర్పులు కోరుకుంటున్నారు. మేయర్‌ ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో సభ్యులకు ఓటు వేసే అవకాశం కల్పించకూడదంటూ సీపీఐకు చెందిన నారాయణ, చాడ వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రత్యేకంగా ఒక లేఖాస్త్రాన్ని సంధంచడం ఈ సందర్భంగా గమనార్హం.

కామెడీ ఏంటంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలు నోటిఫికేషన్‌ విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రకటితమయ్యాయి. మేయర్‌ ఎన్నికకు ఎక్స్‌ అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారంటూ చాలా స్పష్టంగా విధివిధానాల్లో పేర్కొన్నారు. విధివిధానాలు వచ్చిన తర్వాత ఇన్ని రోజులూ నింపాదిగా నోరు మెదపకుండా కూర్చుని.. తీరాపోలింగ్‌ దశ వచ్చిన తర్వాత.. ఇప్పుడు అసలు నిబంధనల్నే మార్చాలంటూ కోరడంలో విజ్ఞత ఏపాటి ఉన్నదో ఈ వామపక్ష నాయకులే ఆలోచించాలి.

వారు దీన్నేదో రాజకీయ చేసి.. మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి కేసీఆర్‌ చేస్తున్న కుట్రగా అభివర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు. మేయర్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచిన వారుమాత్రమే ఓటు వేయాలని, కానీ కేసీఆర్‌ మాత్రం ఎక్స్‌ అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారని చెబుతున్నారని అంటున్నారు. ఇది ఈ ఎన్నికలకు సంబంధించిన నిబంధనగా నిర్దేశించారే తప్ప.. కేసీఆర్‌ చెబుతున్న మాటగా ఆపాదించడం కరెక్టు కాదు.

రేప్పొద్దున్న మేయర్‌ పీఠం తెరాసకు దక్కితే ‘మేం ముందే చెప్పాం.. ఆ ఎన్నికల సిస్టంలోనే లోపాలున్నాయి. వాళ్లు కుట్ర చేసి గెలిచారు’ అంటూ అరచి గీ పెట్టడానికి తప్ప మరెందుకూ ఈ లేఖాస్త్రం వారికి ఉపయోగపడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close