హ్యాపీ బర్త్‌డే చంద్రబాబు..! మోడీ, జగన్ విషెస్..!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఆయనకు ట్విట్టర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు.. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు… ఉండవల్లిలోని సీఎం ఇంటికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి ఈ రోజు కూడా.. అనేక కార్యక్రమాలతో బిజీగా ఉండనున్నారు. హైదరాబాద్‌లో ఓ వివాహానికి హాజరై.. అక్కడ్నుంచి తిరుపతికి వెళ్తారు. అక్కడ బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభిస్తారు. చంద్రబాబు తన 69 ఏళ్ల జీవితం పూర్తిగా రాజకీయంతోనే ముడిపడి ఉంది. విద్యార్థి నేతగా.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. పధ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రి, పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పని చేశారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా… సెంటర్ పాయింట్‌గా ఉంటూనే వస్తున్నారు.

గత ఏడాది పుట్టిన రోజున ఆయన… ధర్మపోరాట దీక్షలు ప్రారంభించారు. విజయవాడలో రోజంతా దీక్ష చేశారు. ఆ తర్వాత రాజకీయ పోరాటం ప్రారంభించారు. ఏడాది పాటు అలుపెరగకుండా… కేంద్రంపై పోరాటం చేశారు. మళ్లీ పుట్టిన రోజు వచ్చే సరికి.. ఆయన ఎన్నికల సమరం ముగించారు. ఫలితం… ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలిస్తే.. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. అదో చరిత్ర అవుతుంది. కేంద్రంలో.. చక్రం తిప్పే అవకాశాలు ఈ ఏడాది మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ఇరవై స్థానాల వరకూ గెలుచుకుంటే… కచ్చితంగా.. ఢిల్లీలో చంద్రబాబుది కీలక పాత్ర అవుతుంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని.. ఇప్పటికే…క్లారిటీ వచ్చేయడం.. గతంలో.. చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్ర ఇప్పటికీ.. తెర ముందే ఉండటంతో.. ఆయనకు కలసి రానుంది.

జాతీయ నేతలందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో… ఆ కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు 69వ వసంతంలో.. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగేలా… సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ఆయన నిరంతర శ్రమ, పట్టుదలే కారణం. .. హ్యాపీ బర్త్ డే .. చంద్రబాబు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close