క్లైమాక్స్‌పై ఆశ‌లు పెట్టుకున్న ‘మ‌హ‌ర్షి’

ఏ సినిమాకైనా హై మూమెంట్స్ నాలుగో అయిదో ఉంటాయి. ఎంత పెద్ద సూప‌ర్ హిట్ సినిమా అయినా తీసుకోండి.. అయిదారు ఎసిపోడ్స్ క్లిక్ అయితే చాలు అనుకుంటారు. కొంత‌మంది ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌పై న‌మ్మ‌కం పెట్టుకుంటారు. ఇంకొంత‌మంది క్లైమాక్స్ పై ఆధార‌ప‌డిపోతుంటారు. ‘మ‌హ‌ర్షి’ ప్రాణం అంతా ఆ క్లైమాక్స్ ద‌గ్గ‌రే ఉంది. అందుకే ప‌తాక స‌న్నివేశాల‌పై గంపెడు ఆశ‌లు పెట్టుకుంది చిత్ర‌బృందం. ఈ సినిమా కోసం ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ డిజైన్ చేశాడు వంశీ పైడిప‌ల్లి. అది చూస్తే ఎవ్వ‌రికైనా క‌న్నీళ్లు ఆగ‌వ‌ట‌. ఈ విష‌యాన్ని దిల్‌రాజునే చెప్పాడు.

దాంతో పాటు అల్ల‌రి న‌రేష్ పాత్ర‌పైనా చాలా హోప్స్ ఉన్నాయి. ఈ పాత్ర ఏ మేర‌కు పండుతుంది? ఏ స్థాయిలో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నాటుకుపోతుంది అనేదాన్ని బ‌ట్టి మ‌హ‌ర్షి సినిమా జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌ని ముందు నుంచీ హైడ్ చేస్తూనే వ‌స్తోంది చిత్ర‌బృందం. స్క్రీన్ పై ఆ పాత్ర చూసి షాక్ అవ్వాల‌న్న‌ది వాళ్ల ఉద్దేశం. న‌రేష్ పాత్ర‌కు యాంటీ క్లైమాక్స్ డిజైన్ చేశార‌ని, క‌థానాయ‌కుడి పాత్ర‌లో మార్పు అక్క‌డి నుంచే మొద‌ల‌వుతుందని, ఆ పాత్ర‌… ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మ‌హ‌ర్షి బ‌లం.. న‌రేష్‌, క్లైమాక్స్ సీన్ అని తేలిపోయింది. మ‌రి ఇవి రెండూ ఈ సినిమాని ఏ మేర‌కు గ‌ట్టెక్కిస్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close