మోడీ కేబినెట్‌లో ఉత్తరాది ప్రాబల్యం..! సమతూకం ఉందా..?

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. తన టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఇందులో… సమీకరణాలు.. ప్రాంతాల వారీగా చూస్తే… సమతుల్యం మాత్రం మిస్సయినట్లుగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సహా 58 మందితో మంత్రి మండలి ఏర్పాటయింది. ఇందులో దక్షిణాది నుంచి ఉన్నవారు అతి స్వల్పమయితే.. అందులోనూ సహాయమంత్రులే అత్యధికం.

ఉత్తరాదికి పెద్ద పీట..!

మోడీ మంత్రివర్గంలో ఉత్తర్ప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. యూపీ వారణాసి నుంచి మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, లఖ్నవూ ఎంపీ స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్ గెలుపొందారు. ఏడుగురు మంత్రులతో యూపీ తర్వాత రెండోస్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఆరుగురు మంత్రులతో బిహార్కు మూడో స్థానం దక్కింది. గుజరాత్, రాజస్థాన్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రి మండలిలో అవకాశం లభించింది. బెంగాల్ , ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

దక్షిణాదిలో కర్ణాటకకు మాత్రమే గుర్తింపు..!

దక్షిణాదిపై బీజేపీ వివక్ష చూపిస్తూందంటూ.. చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో ఒకటైన.. కర్ణాటకకు… మూడు మంత్రి పదవులు ఇచ్చారు. అందులో కేబినెట్ హోదా ఉన్న పదవి కూడా ఉంది. మిగతావి సహాయమంత్రి పదవులు. తమిళనాడు, కేరళలకు ఓ సహాయమంత్రి పదవి లభించింది. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి.. కేబినెట్ బెర్త్ ఇస్తారనుకుంటే… సహాయమంత్రికే సరిపెట్టారు. కనీసం ఇండిపెండెంట్ చార్జ్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం.. ఎలాంటి పదవీ దక్కలేదు. ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మణిపుర్, మిజోరం, సిక్కిం, త్రిపురలకు కూడా కేబినెట్‌లో చోటు దక్కలేదు.

ఒక్క మంత్రి పదవినీ వద్దన్న మిత్రుడు నితీష్..!

మోదీ కేబినెట్‌ లో శివసేన, అకాళీదళ్‌తో పాటు మిత్రపక్షాలన్నింటికీ ఒకే ఒక్క స్థానం దక్కింది. అయితే కేబినెట్‌లో సింగిల్‌ బెర్త్‌ ఇవ్వడంపై బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేబినెట్‌లో చేరమంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో చేరకపోయినా… ఎన్డీయేలోనే కొనసాగుతామన్నారు నితీష్‌ కుమార్‌. త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మోదీ కేబినెట్‌కు దూరంగా ఉంటామని నితీష్‌ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close