బెజవాడ ఆక్రమణలపై ఉక్కుపాదం ఎప్పుడు..? గుణదలకు విముక్తి ఉందా..?

ప్రజావేదిక కూల్చివేత తర్వాత… ఆక్రమణలపై జగన్మోహన్ రెడ్డి ఉక్కుపాదం మోపుతారని.. ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజధాని నగరం విజయవాడలో… అనేక చోట్ల.. ఆక్రమణలు పెరిగిపోయాయి. కొండల్ని.. గుట్టల్ని కూడా కబ్జా చేసేశారు. వాటి వల్ల అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోంది. కొండలపై ఇళ్లు నిర్మించడంతో.. కొండరాళ్లు జారిపడి జరుగుతున్న ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఇప్పుడు బెజవాడ అంతా.. జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. ఆక్రమణల నుంచి విముక్తి కావాలని కోరుకుంటోంది.

విజయవాడలో కాలువగట్లు, కొండల్ని కూడా ఆక్రమించేశారు.. !

విజయవాడలో ఆక్రమణలు ఎక్కువగా వన్ టౌన్ ప్రాంతం, క్రీస్తురాజపురం, చిట్టినగర్‌, గుణదల, మొగల్రాజపురం, సింగ్‌నగర్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న కొండలమీద ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. చిట్టినగర్‌ ప్రాంతంలో కొండలమీదకు ఏకంగా సిమెంటు రోడ్లు నిర్మించారు. ప్రసిద్ధి చెందిన మేరీ మాత ఆలయం ఉన్న గుణదల కొండలపై… ఇష్టం వచ్చినట్లుగా… నిర్మాణాలు వెలిశాయి. దీని వెనుక పెద్దల హస్తం ఉందని అందరికీ తెలుసు. అయినప్పటికీ.. ఇంత వరకూ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. విజయవాడలో దాదాపు 60వేల మంది ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారు. ఆక్రమణలకు కొండ ప్రాంతాలు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొన్ని అటవీశాఖవి కూడా ఉన్నాయి. నీటిపారుదల శాఖ స్థలాలను, కాలువ గట్లు ఆక్రమించి కూడా నిర్మాణాలు చేశారు. రైల్వే స్థలాల్లోనూ కొంతమంది ఆక్రమించారు. కొండలను ఆక్రమించుకున్న వారు దాదాపుగా 20వేల మంది ఉన్నారని అంచనా. 10వేల మంది కాలువ గట్లు ఆక్రమించారు.

ఇంత కాలం ఓటు బ్యాంక్‌ కోసం… నేతల అవినీతి..!

ఈ ఆక్రమణల్లో.. పేదలు ఉంటున్నప్పటికీ.. ఈ ఆస్తులన్నీ పెద్దలు అమ్ముకోవడమో.. అద్దెకు ఇవ్వడమో చేశారు. ఇదంతా పెద్దల పాపమే. ఇరవై ఏళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం వల్ల.. సామాన్యులు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ప్రతి ప్రభుత్వం.. ఆక్రమణలపై… కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని.. కఠినంగా వ్యవహరిస్తామని చెబుతూ ఉంటారు కానీ.. ఒక్కరంటే.. ఒక్కరూ.. కూడా.. వీటిని కనీసం కట్టడి చేసే ప్రయత్నాలు కూడా చేయలేదు. పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉండటంతో.. ఎక్కడ ఓటు బ్యాంక్‌కు చిల్లు పడుతుందోనని.. రాజకీయ పార్టీలు భయపడ్డాయి. ఫలితంగా.. ఆక్రమణలు పెరిగిపోయాయి. ఇప్పుడు వాటిని సరి చేసే సీఎం వచ్చారు.

జగన్ వాటన్నింటినీ తొలగించి మాటలు కాదు.. చేతలేనని నిరూపిస్తారా..?

గుణదల కొండపై.. ఆక్రమణలు మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడ వివిధ మత సంస్థల పేరుతోనూ… ఆక్రమణలు పెరిగిపోయాయి. నిజానికి కొండలపై.. ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి.. ఆస్తి హక్కు ఉండదు. అది సహజసంపద. ప్రభుత్వానికి చెందుతుంది. అయితే.. రాజకీయ నేతల అండతో.. కబ్జాలు చేశారు. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. అలాంటివాటిని ఏమీ … పట్టించుకోనని.. కూల్చి తీరుతామని ప్రకటించారు కాబట్టి.. ఆక్రమణల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి.. ఆశలు చిగురించి. మరి జగన్మోహన్ రెడ్డి.. విజయవాడ వైపు చూస్తారా..? చంద్రబాబు… ఇంటితోనే సరి పెడతారా..? ఓటు బ్యాంక్ రాజకీయం కోసం.. ఇతర ఆక్రమణలు పట్టించుకోనని.. నిరూపిస్తారా..? అన్నది… మరో వారం రోజుల్లో తేలిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close