జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి

నటుడు, రచయిత, దర్శకుడు అయిన పోసాని కృష్ణమురళి ఎప్పటినుండో వైఎస్ఆర్సిపి కి మద్దతు ఇస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‌

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటు తెలంగాణలో కేసీఆర్ అటు ఆంధ్రప్రదేశ్ లో జగన్, కేంద్రంలో మోడీ ముగ్గురు కూడా చంద్రబాబు మీద పగ పట్టినట్లుగా ప్రవర్తిస్తుండడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు బిజెపిలోకి ఫిరాయించడం, త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించి తీరతారని వార్తలు వస్తుండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులలో నిరుత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ చేతికి పగ్గాలు ఇస్తే తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని చెబుతూ వస్తున్నారు. ఈ వాదనతో విభేదించేవారు సైతం జూనియర్ ఎన్టీఆర్ శక్తిసామర్థ్యాల మీద నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు, లోకేష్ తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని మరింత చక్కగా నడపగలరని వారు అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ని స్పందించమని కోరగా ఆయన, తెలుగుదేశం పార్టీని పైకి లేపడం జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా కాదని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ లో అద్భుతాలు ఏమీ జరగవని పోసాని అభిప్రాయపడ్డారు. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ ఒకరికి మాత్రమే కాదని సినిమా హీరోలు అందరికీ వర్తిస్తుందని, సినిమా హీరో లను ప్రజలు నమ్మే రోజులు పోయాయని పోసాని వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం పొందుకో లేదని చెప్పడం ద్వారా పోసాని, వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారని చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close