కర్ణాటకానికి ఆ విధంగా లాజికల్ ఎండింగ్..!?

కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో.. ముంబై టు బెంగళూరు తిరుగుతూ.. తమ రాజీనామాలకే కట్టుబడి ఉన్నారు. దీంతో.. ఇవాళ కాకపోయినా.. రేపైనా స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించక తప్పదు. ఆ తర్వాత కుమారస్వామి సర్కార్ నిలబడటం అసాధ్యం. దాంతో.. ఇప్పుడు.. ప్రత్యామ్నాయం ఏమిటన్న అంశం.. విపరీతంగా చర్చకు వస్తోంది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా దిగిపోయినా.. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి వస్తారని.. నిన్నటిదాకా అంచనా వేశారు. కాంగ్రెస్, జేడీఎస్ వర్గాలు కూడా అదే చెప్పాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. జేడీఎస్‌తో.. బీజేపీ టచ్‌లోకి వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక వ్యవహారాలను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. అయితే.. ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. సభలో కావాల్సిన సభ్యుల సంఖ్యను తక్కువ చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా… ఆ తర్వాత ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోతే… పరువు పోతుంది. ప్రభుత్వం కూడా కుప్పకూలుతుంది. అదే జరిగితే… జాతీయ స్థాయిలో బీజేపీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్ ఎందుకని… బీజేపీ నేరుగా.. జేడీఎస్‌తో టచ్‌లోకి వెళ్లిందని తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు.. బెంగళూరులో మకాం వేసి.. జేడీఎస్ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

గతంలో బీహార్ లో.. ఆర్జేడీ, జీడీయూ కూటమి ప్రభుత్వాన్ని విచ్చిన్నం చేసి.. జేడీయూతో కలిసి.. బీజేపీ సర్కార్‌ను ఏర్పాటు చేసింది. కర్ణాటకలోనూ అదే తరహాలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని విచ్చిన్నం చేసి… జేడీఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. జేడీఎస్ కలసి వస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తోంది. సంఖ్యాబలం రీత్యా.. జేడీఎస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కుమారస్వామి సోదరుడు.. రేవణ్ణకు ఈ పదవి ఆఫర్ ఇచ్చారు. దీంతో.. జేడీఎస్‌లోనూ.. చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు.. ప్రభుత్వం నిలబడటం కష్టం కాబట్టి.. ఏదో విధంగా.. సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటే మంచిది కదా అన్నట్లుగా.. వారి ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి, రెండురోజుల్లో… ఈ విధంగా లాజికల్ ఎండింగ్‌కు కర్ణాటకం వచ్చినా ఆశ్చర్యం లేదన్న భావన వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close