అమరావతి దానంతటకి అది ఎదగాల్సిందేనని తేల్చిన బుగ్గన..!

ప్రపంచంలో ఎక్కడైనా నగరాన్ని అప్పు చేసి నిర్మించరని… దానంతట అదే నగరం అభివృద్ధి చెందుతుందని అసెంబ్లీ సాక్షిగా.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. గతంలో.. అసెంబ్లీ బయట ఎక్కడైనా అమరావతి ప్రస్తావన వస్తే.. మాకూ కట్టాలనే ఉంటుంది.. సమయం వచ్చినప్పుడు కడతామని చెప్పేవారు. కానీ.. ప్రపంచబ్యాంక్ రుణం ఆగిపోయిన తర్వాత… దానంతటకు అదే అభివృద్ధి చెంతుతుందనే.. విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ప్రపంచ బ్యాంక్ లేఖ రాసింది. అమరావతిలో మరో సారి పరిశీలన జరిపి రుణం మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని సమాచారం పంపింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది…కానీ ప్రపంచ బ్యాంక్ రుణం వస్తుందని ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దీనితో శాశ్వతంగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే ప్రభుత్వం మాత్రం.. టీడీపీ దోపిడీని చూసి వరల్డ్ బ్యాంకు భయపడిపోయిందని.. అందుకే రుణం రాలేదని వాదిస్తోంది.

అమరావతిపై వైసీపీ సర్కార్ విధానం విషయంలో.. టీడీపీ అభ్యంతరాలు వేరేగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి నగరాలు నిర్మిస్తేనే ఏపీకి ఆదాయమని మాజీ సీఎం చెబుతున్నారు. అమరావతిపై వైసీపీ ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయాల కారణంగా.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అమరావతిని ఇంకా భ్రమరావతిగానే.. వైసీపీ నేతలు చూస్తున్నారని… చంద్రబాబు మండి పడుతున్నారు.

అమరావతి విషయంలో ప్రస్తుతం ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచనలు లేవని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేరుగా చెప్పినట్లయింది. ప్రస్తుతం నిర్మాణ కార్యకాలాపాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రుణం ఇస్తామన్నవారు కూడా వెనుకడుగు వేశారు. అదే సమయంలో.. ప్రస్తుత ప్రభుత్వం కూడా అమరావతిపై ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడం… అందులో అంతులేని అవినీతి జరిగిందన్న వాదన విపిస్తోంది. నవ్యాంధ్ర రాజధానిపై అసలు ఏపీ సర్కార్ విధానమేంటో.. అధికారికంగా వెల్లడించలేదు. కానీ.. అమరావతి విషయంలో.. తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ప్రాధాన్యతాంశాల్లో లేదని మాత్రం… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close