కొత్తపలుకు : ఒక వర్గం ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే పనిలో జగన్..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ… తన వారాంతాపు ఆర్టికల్‌ “కొత్త పలుకు”లో ఏదైనా సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. మొహమాటలకు పోరు. కానీ ఈ సారి.. ఓ విషయాన్ని బలంగా చెప్పాలనుకున్నప్పటికీ.. మొహమాటానికి పోయారు. కేవలం.. ఒకే ఒక్క పదం.. ఒక్కే లైన్‌తో ఆ మాటను..అదీ చిట్టచివరన సరిపెట్టారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు… కాంట్రాక్టుల రద్దు లాంటి వ్యవహారాలన్నీ.. ఓ వర్గం ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికేనన్నట్లుగా “కొత్త పలుకు”లో వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు.

పోలవరం ప్రాజెక్ట్‌పై చేస్తున్న ప్రచారమేంటి..? ప్రభుత్వం చేసిందేమిటి..?

పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రద్దు విషయంలో అసలేం జరిగిందో.. వేమూరి రాధాకృష్ణక్లారిటీ ఇచ్చారు. అవినీతి పేరుతో ప్రభుత్వం.. హడావుడి చేసి.. నవయుగకు టెర్మినేషన్ నోటీసులు ఇచ్చింది. కానీ.. ప్రభుత్వం కేవలం “ప్రభుత్వ సౌకర్యం కోసం” అనే ప్రధానమైన కారణంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి వైదొలగాలని నవయుగను ఆదేశించింది. ఈ ప్రభుత్వ సౌకర్యం కోసం అనే నిబంధన… అన్ని కాంట్రాక్టుల్లోనూ ఉంటుందని… ఏ దారి లేనప్పుడు మాత్రమే.. ప్రభుత్వాలు.. ఎలాగైనా ఇష్టం లేని కాంట్రాక్టర్లను తొలగించాలనుకుంటే..,ఈ దారిని ఎంచుకుంటాయన్నట్లుగా.. వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు.

పన్నుల వినియోగంపై “నిజమే కదా”.. అనిపించే విశ్లేషణ..!

ఇప్పుడు దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అటు రైతు బలవన్మరణం చెందుతున్నాడు. ఇటు కార్పొరేట్లూ.. అదే పని చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..? ప్రభుత్వాల బాధ్యత ఎంత..? అన్నదానిపై వేమూరి రాధాకృష్ణ…తన అభిప్రాయాల్ని సూటిగానే వినిపించారు. ” కష్టపడి వ్యాపారం చేసి పన్నులు కట్టేవారి వల్లనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కడుతున్న పన్నులతో రాజకీయ పార్టీలు అడ్డమైన హామీలు ఇస్తున్నాయి. సంక్షేమం పేరిట ప్రభుత్వాలు ఈ నిధులన్నీ వాడేస్తున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు పన్ను కడుతున్నారు? ఎవరో శ్రమించి చెల్లించే పన్నులను తమ సొంత సొమ్ము అన్నట్టుగా పంచి పెట్టే హక్కు రాజకీయ నాయకులకు ఎక్కడిది? లాభాలు వచ్చినప్పుడు పన్నులు కట్టి, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నష్టాలు చవిచూసే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోవు?..” అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నల వర్షం కురిపించారు. తరచి చూస్తే ఇది నిజమే. ఆదాయం ఉన్నప్పుడు పన్నులు వసూలు చేసిన.. సర్కార్… ఆదాయం లేనప్పుడు ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయదన్నది పన్నులు కట్టే వారిలో కామన్‌గా వచ్చే ఆలోచన.

పీఠాలు, మఠాలు పెట్టుకోవడం బెటరని ఆర్కే సహా..!

ఏబీఎన్ ఆర్కే… ఈ వారం “కొత్త పలుకు”లో ఇద్దరు స్వాములపై .. దృష్టి కేంద్రీకరించి… కథనం రాసినా.. దీని వెనుక లోతైన అర్థం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్వాముల చేతుల్లో ప్రభుత్వాలున్నాయని తేల్చేశారు. మంత్రులు, అధికారులు డమ్మీలైపోయారని నిర్దారించారు. అంతే కాదు.. సిద్ధార్థ ఆత్మహత్య వ్యవహారంతో లింక్ పెట్టి.. ఇక వ్యాపారాలు చేయడం దండగని.. నాలుగు మంత్రాలు నేర్చుకుని… పీఠమో.. మఠమో పెట్టుకోవడం మంచిదన్న సలహా కూడా ఇచ్చారు. ఈ ఫ్రస్టేషన్ ఆర్కేకి మాత్రమే.. సాధారణ ప్రజల్లోనూ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తంగా… “కొత్త పలుకు”లో చరమ వాక్యం మాత్రం.. ఏపీలో జగన్ సర్కార్ లక్ష్యం ఏమిటో చెప్పి ముగించారు. అమరావతి నిర్మాణం నిలిపి వేత దగ్గర్నుంచి ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం చూసిన వారి.. అది వాస్తవమే కదా.. అని అనిపించక మానదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close