వైసీపీ మార్క్..! కేంద్రంపై మాటల్లో వినయం.. చేతల్లో లైట్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విషయంలో.. చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నట్లుగా… బయటకు రాజకీయం వ్యూహం అమలు చేస్తోంది. కేంద్రం.. ఈ రెండు నెలల కాలంలో.. ఎన్నో సార్లు.. ఏపీ సర్కార్‌కు.,. జగన్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా నేరుగా ప్రకటనలు చేసింది. జగన్‌పై.. రామ్‌మాధవ్ లాంటి వాళ్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. బీజేపీ విషయంలో.. వినయ విధేయ రామ అన్నట్లుగా ఉంది. ప్రతి విమర్శలు చేయడం లేదు. అత్యంత హుందాగా వ్యవహరిస్తోంది. తమపై విమర్శలు చేసిన నేతలను కూడా.. పెద్దగా టచ్ చేయడం లేదు. అలా అని.. నిర్ణయాల విషయంలో.. దూకుడు ఏమీ తగ్గించడం లేదు.

మొదటగా కరెంట్ కొనుగోలు ఒప్పందాల విషయంలో… కేంద్ర ప్రభుత్వం.. ఏపీ సర్కార్ కు… లేఖ రాసింది. సమీక్షల్లాంటి పనులు చేయవద్దని సూటిగానే చెప్పింది. అయితే జగన్మోహన్ రెడ్డి లక్ష్య పెట్టలేదు. తాను మోడీతోనే మాట్లాడానని… ఎవరినీ పట్టించుకోవద్దని.. ఆయన దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. కేంద్రం నుంచి మరో సీరియస్ లేఖ వచ్చింది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ అదే జరిగింది. అక్రమాలేమీ జరగలేదని.. కేంద్రం పార్లమెంట్ సాక్షిగా .. సర్టిఫికెట్ ఇవ్వడంతో… జగన్ అయోమయానికి గురైనా… ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన దారిలో తాను వెళ్తున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన.. పోలవరం కాంట్రాక్టుల్ని.. కేంద్రంతో సంబంధం లేకుండా రద్దు చేసేశారు. దీనిపై.. కేంద్ర జలశక్తి మంత్రి కూడా.. నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది.

ఓ వైపు.. అత్యంత వినయం ప్రదర్శిస్తూ.. మరో వైపు.. వైసీపీ.. ఇలా కేంద్రం అంటే లెక్కలేనట్లుగా వ్యవహరిస్తూండటంతో బీజేపీ నేతలకు.. తేడా కొడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే.. జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నాడన్న ఉద్దేశంతో… ఏపీ సర్కార్ పై.. బీజేపీ నేతలు దూకుడు పెంచారు. అదే సమయంలో.. తాము.. జగన్ సర్కార్ నిర్ణయాలపై సమీక్షలు చేస్తామంటూ… పార్టీ నేతలతో ప్రకటనలు ఇప్పిస్తున్నారు.. బీజేపీ పెద్దలు. జగన్ ప్లాన్‌కు విరుగుడు రెడీ చేశామని.. బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి.. బీజేపీ – జగన్ మధ్య … అప్పట్లో ఉన్నంత స్నేహబంధం ఇప్పుడు లేదని మాత్రం తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close