పోలవరం ఆపడానికి మరో మార్గం దొరికినట్లే..!

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అనూహ్యమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ… షోకాజ్ నోటీసు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సాయం అందించాలని… ప్రధానికి, కేంద్రమంత్రులకు.. సీఎం జగన్మోహన్ రెడ్డి వినతి పత్రాలు అందిస్తున్న సమయంలోనే… ఈ షోకాజ్ నోటీసు జారీ కావడం కలకలం రేపుతోంది. 2005లో పోలవరం, అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణశాఖకు చెందిన చెన్నై అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీరు … పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించారని కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా.. కేంద్రం… పోలవరం ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది.

నిజానికి .. 2015లో పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై .. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలయింది. అప్పట్లో విచారణ జరిపిన ఎన్జీటీ పోలవరం పనులు నిలిపి వేయాలని.. స్టాప్ ఆర్డర్ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ.. స్టే ఆర్డర్ ఇచ్చింది. ప్రతీ సారి ఏడాది పాటు.. ఈ స్టేపై ఆర్డర్ ఇస్తూ వస్తోంది. ఇటీవల ఈ స్టే ఆర్డర్ గడువు ముగియడంతో.. ఈ సారి రెండేళ్ల పాటు పొడిగింపు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఇలా రెండేళ్ల పాటు పనులపై స్టాప్ ఆర్డర్ ఉత్తర్వులపపై స్టే ఇచ్చిన కొన్ని రోజులకే అదే కారణంతో.. మళ్లీ షోకాజ్ నోటీసు జారీ చేయడం… రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.

నిజానికి.. విభజన చట్టంలో… పోలవరానికి .. అన్నీ అనుమతులు ఇచ్చేసినట్లేనన్న క్లాజ్‌ను చేర్చారు. అయినప్పటికీ.. వివిధ రకాల అనుమతుల పేరుతో.. పోలవరం ప్రాజెక్ట్ కు నోటీసులు వస్తూనే ఉన్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ స్టే ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన అంశంలోనే.. ఇప్పుడు .. షోకాజ్ నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ సంస్థలను.. వెళ్లిపోవాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. రీ టెండరింగ్ కు వెళ్లేందుకు ఏపీ సీఎం రెడీ అవుతున్నారు. ఈ సమయంలో.. అసలు పోలవరమే ఆగిపోయే పరిస్థితి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close