రిజర్వేషన్లపై రద్దుపై చర్చ ప్రారంభించేసిన ఆరెస్సెస్, బీజేపీ..!

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై దృష్టి పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీకి సిద్ధాంతపరమైన సంస్థగా ఉన్న ఆరెస్సెస్…మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకం. మోడీ సర్కార్ అత్యంత వేగంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో… ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలోరిజర్వేషన్లపై శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారి భావాలను అర్థం చేసుకోవాల … వారి ప్రయోజనాలను కూడా ఆలోచించాలని సూచించారు. రిజర్వేషన్లను పునః సమీక్షించాలంటూ గతంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.

వివిధ విద్యార్థి, కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే అప్పట్లో బీజేపీ ఇంత డైనమిక్ గాలేదు. కానీ ఇప్పుడు.. బీజేపీ దేశంపై .. పార్లమెంట్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఈ క్రమంలో మోహన్ భగవత్ మాటలకు.. మద్దతు పెరుగుతోంది. నిజానికి బీజేపీలో..చాలా కాలంగా .. రిజర్వేషన్ల రద్దుపై అంతర్గతంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు యూపీకి చెందిన కొంత మంది రిజర్వుడు నియోజకవర్గాల ఎంపీలు.. బీజేపీ..రిజర్వేషన్ల రద్దుపై… చర్చ జరుగుతోందని…ఆరోపించారు. కొంత మంది బీఎస్పీలో చేరిపోయారు. నిజంగానే.. ఆరెస్సెస్, బీజేపీలో… ఈ రిజర్వేషన్ల అంశంపై.. చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

ఏ విధంగా.. చూసినా… రిజర్వేషన్ల అంశంపై.. ఓసీలు తీవ్ర అసంతృప్తిలో ఉంటారు. రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడితే.. పార్టీలకు అతీతంగా..బీజేపీకి మద్దతు లభిస్తుంది. కానీ ప్రజల మధ్య విభజన రేఖ పెరిగిపోతుంది. ఈ క్రమంలో… బీజేపీ… కశ్మీర్ విషయంలో వేసినట్లుగా సాహసోపేతమైన అడుగు వేస్తుందా.. లేక.. చర్చలతో వచ్చే స్పందనను బట్టి…అడుగులు వేస్తుందా.. అనేది ఆసక్తికరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close