రాజధాని మార్పు పై బొత్స వ్యాఖ్యల కలకలం, తుగ్లక్ నిర్ణయం అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని సురక్షితం కాదంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారుతున్నాయి. స్వయంగా మంత్రి గా ఉండి రాష్ట్ర రాజధాని సురక్షితం కాదని, దీన్ని మార్చడం పై తాము ఆలోచిస్తున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు:

ఆంధ్రప్రదేశ్ రాజధానికి వరద ముప్పు ఉందని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది చాలా స్పష్టంగా అర్థమవుతోందని, రాజధాని మార్చాలనే విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అసలు శివరామకృష్ణ కమిటీ అమరావతి రాజధాని కి సంబంధించి ఎటువంటి సూచనలు చేసిందో కూడా ఇప్పుడు తమ పరిశీలిస్తున్నామని, అమరావతిని రాజధానిగా చేస్తే దాన్ని సురక్షితంగా మార్చడం కోసం డ్యాములు నిర్మించాలని వస్తుందని, దాని అర్థం- రాజధాని కోసం మరింత వ్యయం పెట్టాల్సి ఉంటుందని, తద్వారా విలువైన ప్రజాధనం వృధా అవుతుందని, కాబట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వద్దా అనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందని బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పల్లపు ప్రాంతంలో , వరదలు వచ్చే ప్రాంతంలో రాజధానిని ఎందుకు ఎంపిక చేశారని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలదీసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

దొనకొండ కోసమేనా?

అమరావతి రాజధాని నిర్మాణం నుండి ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలు వైదొలగినప్పుడే చాలామందికి అనుమానాలు వచ్చాయి – బహుశా, జగన్ ప్రభుత్వానికి అమరావతి రాజధానిగా కొనసాగించటం ఇష్టం లేదని. అయితే అప్పుడు వచ్చిన మరొక వాదన ఏంటంటే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాన్ని విభజించినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలోని చాలా మందికి దొనకొండ ను కాంగ్రెస్ రాజధానిగా చేయనుంది అనే అంతర్గత సమాచారం అందింది అని. దీంతో అప్పటి కాంగ్రెస్ నేతలు చాలామంది దొనకొండ లో భూములు కొనుగోలు చేశారని వార్తలు కూడా వచ్చాయి. అప్పటి కాంగ్రెస్ నేతలందరూ చాలావరకు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపిలో లేదంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో ఉన్నారు. దీంతో తమ భూములకు విలువ పెంచుకోవడం కోసమే వీరు అమరావతిని అభివృద్ధి చేయకుండా, దొనకొండ మీద దృష్టి కేంద్రీకరించిిిి అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. నిజానికి అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరగడం మంచిదే కానీ, అధికార పార్టీ రాజకీయ నాయకులు తమ భూముుల విలువ పెంచుకోవడం కోసం , తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మాత్రం సమంజసం కాదు. పైగా ముంబై, చెన్నై వంటి దేశంలోని చాలా రాజధానులు వరద ముప్పు ఉన్న ప్రదేశంలోనే ఉంటూనే అభివృద్ధి చెందాయి.

ఇప్పుడు విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల తర్వాత ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది ఏమో, దొనకొండ ను, అమరావతి ని రెండింటిని రాజధానులుగా ప్రకటించి రెండు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం. రెండవది, అమరావతిలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని ఇంతటితో ఆపేసి, ఇకపై పూర్తిగా దొనకొండ మీద దృష్టి సారించి కాలక్రమంలో దొనకొండ ని పూర్తిస్థాయి రాజధానిగా మార్చడం. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల తర్వాత వినిపిస్తున్న ఈ రెండు వాదన లలో ఏది నిజమైనా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడే అవకాశం కనిపిస్తోంది.

ఇది తుగ్లక్ నిర్ణయం అవుతుందా?

మధ్యయుగం లో భారత దేశాన్ని పాలించిన తుగ్లక్ అనే రాజు గురించి చాలామందికి తెలిసిందే. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ఢిల్లీ నుండి రాజధానిని దౌలతాబాద్ కి మార్చి, ప్రజలను కూడా అక్కడికి తరలించే క్రమంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన తుగ్లక్ ని చరిత్ర పిచ్చి తుగ్లక్ గా గుర్తు పెట్టుకుంది. ఇదే తుగ్లక్ ఆ తర్వాత కాలంలో మళ్ళీ దౌలతాబాద్ నుండి రాజధానిని ఢిల్లీకి మార్చే ప్రయత్నం కూడా చేసి ప్రజలు ఇచ్చిన పిచ్చి తుగ్లక్ బిరుదు కి తాను అర్హుడనే అని నిరూపించుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఉన్న అమరావతి రాజధానిని దొనకొండ కి మార్చే ప్రయత్నం చేసినా, ఒకవేళ ఆ తర్వాత మళ్లీ అమరావతే మేలు అంటూ తిరిగి నిర్ణయాన్ని మార్చుకున్నా, ప్రస్తుత ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అప్పటి తుగ్లక్ నిర్ణయంతో ప్రజలు పోల్చి చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి.‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close