అధికారుల్ని జైలుకు పంపిన తెలంగాణ సర్కార్..!

ప్రభుత్వమూ.. అధికారులు వేర్వేరా..? అధికారులతో పని చేయించుకోలేకపోవడం ప్రభుత్వ చేతకాని తనం కాదా..?… ప్రభుత్వం ఎక్కడైనా… అధికారులు పని చేయలేదని… తమ తప్పు కాదని.. కోర్టులో వాదిస్తే.. ఎలా ఉంటుంది.. ?. ఈ అనుమానాలన్నింటికీ తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం.. ఆర్డీవో, కొండపాక మండల తహసీల్దార్లు…విధుల్లో నిర్లక్ష్యం వహించారని నేరుగా కోర్టుకు… అఫిడవిట్ సమర్పించేసింది. దాంతో.. కోర్టు వారికి రెండు నెలల జైలు శిక్ష , రెండు వేల రూపాయల జరిమానా విధించింది. గజ్వేల్ అంటే.. కేసీఆర్ సొంత నియోజకవర్గం. అలాంటి చోట్ల ఆర్డీవో లాంటి అధికారి.. ఉండాలంటే.. విశ్వాసపాత్రుడే అయి ఉంటారు. అయినప్పటికీ.. ఆయన పని చేయలేదని కోర్టుకే చెప్పి శిక్ష వేయించింది తెలంగాణ సర్కార్.

గజ్వేల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ జరిపింది. ఆయా గ్రామాల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదు. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత మే నెలలో బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి… ప్రతి ఒక్క భూనిర్వాసితుడికి పరిహారం చెల్లించేలా క్షేత్ర స్థాయి నుంచి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పరిహారం అందలేదు.

దీంతో హైకోర్టు… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు జాప్యం జరుగుతోందో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గజ్వేల్ ఆర్డీఓ విజేందర్ రెడ్డి, కొండపాక తహశీల్దార్ ప్రభు విధుల్లో చూపుతున్న నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతోందని ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చింది. అధికారులు తమ సొంత వాదన వినిపించుకునే అవకాశం లేదు. ప్రభుత్వ లాయరే.. వాదించాలి. ప్రభుత్వ లాయర్… అధికారులు నిర్లక్ష్యం చేశారని వాదించారు. దీంతో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు శిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అధికారులిద్దరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close