బొత్స భూముల లెక్కలకు సుజనా కౌంటర్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని చాలా కాలంగా ఆరోపిస్తోంది. సవాల్ చేస్తే.. ఎవరి దగ్గర ఎన్నెన్ని వందల ఎకరాల భూములున్నాయో బయట పెడతామని సవాల్ చేశారు. దానికి సుజనా చౌదరి వెంటనే స్పందించారు. బయట పెట్టమన్నారు. వెంటనే.. బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి.. సుజనా చౌదరి భూములంటూ… కృష్ణా జిల్లాలో వీరులపాడు, చందర్ల పాడు మండలాల్లో ఉన్న భూముల వివరాలు ప్రకటించారు. ఇందులో.. ఓ కంపెనీ పేరు మీద.. 110 ఎకరాలు ఉన్నాయన్నారు. అది ఆయన అల్లుడి కంపెనీ అని బొత్స అన్నారు. మరో 14 ఎకరాలు.. సుజనా చౌదరి సోదరుడి కుమార్తె పేరు మీద ఉన్నాయన్నారు. ఇది చాలదా… అని .. బొత్స.. తన చాలెంజ్‌లో తానే గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు.

నిజానికి రాజధాని ప్రాంతంలో.. టీడీపీ నేతలు వందల ఎకరాలు కొన్నారనేది.. చేస్తున్న ఆరోపణ. కృష్ణా జిల్లా చందర్ల పాడు, వీరులపాడు మండలాలు.. అమరావతికి కనీసం వంద కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఓ రకంగా అవి నల్లగొండ జిల్లా బోర్డర్. వాటిని రాజధాని భూములుగా బొత్స చెప్పడమే చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. రాజధాని పరిధిలో అన్నారు కదా… ఆ భూముల వివరాలు చెప్పమని.. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. మీకెందుకు కంగారు అని.. బొత్స దబాయించి.. వారి నోరు మూసేశారు. బొత్స తీరుపై.. సుజనా చౌదరి సింపుల్‌గానే సెటైర్లు వేశారు. బొత్స భాషా ప్రావీణ్యాన్ని అర్థం చేసుకోవడం కష్టమేనన్నారు. కృష్ణాజిల్లాలో తనకు ఉన్నాయని చెబుతున్న భూములు ఎప్పుడు.. కొన్నానో కూడా చెప్పాలని.. ఆయన పిలుపునిచ్చారు.

బొత్స మాటలు.. సుజనా చౌదరి రియాక్షన్.., రాజకీయానికే. అయితే.. ఇప్పటి వరకూ.. వైసీపీ ఆరోపించినట్లుగా.. సుజనా చౌదరికి.. రాజధాని అమరావతి ప్రాంతంలో.. గజం కూడా భూమి లేదని… ప్రభుత్వమే బొత్స రూపంలో ప్రజలకు చెప్పినట్లు అయిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. నిజంగా.. సుజనా చౌదరికి భూములు ఉంటే.. బయట పెట్టడానికి ఎందుకంత… ఆలస్యమని.. అనుమానం ప్రజల్లో వస్తుంది. 2014 నుంచి రాజధాని ప్రాంతంలో ఎవరెవరు భూములు కొన్నారో ప్రభుత్వం వద్ద… సమాచారం ఉంటుంది. బయట పెట్టాలనుకుంటే క్షణాల్లో పని. తమ దగ్గర ఏ ఆధారం లేకపోతేనే.. సమయం వచ్చినప్పుడు బయట పెడతామని.. రాజకీయ నేతలు తప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు బొత్స.. ఏపీ సర్కార్ కూడా.. అదే వ్యూహాన్ని అమలు చేస్తోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కవిత బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు..

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్...

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

తెలంగాణ మోడల్…బీజేపీ, బీఆర్ఎస్ కు రాహుల్ అస్త్రం ఇచ్చారా..?

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close