శుక్రవారం కోర్టు హాజరు నుండి మినహాయింపు కోరుతున్న జగన్ కు లోకేష్ సలహా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసుల దృష్ట్యా, ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. పాదయాత్ర సమయంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరినా ధర్మాసనం ఒప్పుకోకపోవడంతో పాదయాత్ర సమయంలో సైతం శుక్రవారం యాత్రకు బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ మరొకసారి కోర్టుకు విజ్ఞాపన పెట్టుకున్నారు జగన్.తాను కోర్టుకు హాజరవడాని కి ప్రజాధనం ఖర్చు అవుతుంది కాబట్టి ఆ కారణం చేత తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చి తన లాయర్ మాత్రం హాజరయ్యేలా అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టుకు జగన్ విజ్ఞప్తి పెట్టుకున్నారు.

అయితే ఇదే అంశం మీద సెటైర్లు విసిరారు మాజీ మంత్రి నారా లోకేష్. జగన్ పరిపాలన నుండి తుగ్లక్ పరిపాలన తో పోలుస్తూ, శుక్రవారం శుక్రవారం కోర్టు నుండి హాజరు కాకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తే సరిపోతుంది అంటూ సెటైర్లు విసిరారు. లోకేష్ ట్వీట్ చేస్తూ, ” తుగ్లక్ 2.0 సమస్యకి పరిష్కారం జగన్ గారూ ! రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, హైదరాబాద్ రావడం ఖర్చుతో కూడుకున్నది అని కోర్టుకి కహానీలు ఎందుకు చెప్పడం, దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకి అప్పగిస్తే సరిపోలా !! రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఖజానా నిండుతుంది. అంతే కాకుండా, మీరు ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడానికి అయ్యే భద్రత, రవాణా ఖర్చులకి, ప్రభుత్వానికి నిధులు కూడా సమకూరుతాయి. ఇంత సులువైన పరిష్కారం ఉండగా మినహాయింపు ఎందుకు మాస్టారు. శిక్ష ఎలాగో తప్పదుగా ! ” అని రాసుకొచ్చాడు.

ఈ సెటైర్ లపై వైఎస్ఆర్సిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close