ఆ నివేదిక పీఎంవో, అమిత్ షాకు ఇచ్చి బుక్కైపోయిన జగన్..!?

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. రేమండ్ పీటర్ అనే ఓ అధికారి నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని జగన్ నియమించారు. ఈ రేమండ్ పీటర్ … జగన్ బంధువని దేవినేని ఉమ ప్రెస్‌మీట్ పెట్టినప్పుడల్లా ఆరోపిస్తూ ఉంటారు. ఈ రేమండ్ పీటర్.. పోలవరంపై చకా చకా.. పరిశీలన జరిపి… రూ. మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చేశారు. వెంటనే… ఈ నివేదిక ఆధారంగా.. నవయుగ టెండర్లు రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. కేంద్రం వద్దంటున్నా… ముందుకే వెళ్తున్నారు. ఈ క్రమంలో.. తమ వాదన ఢిల్లీలో వినిపించుకోవడానికి… పీఎంవోలో… అమిత్ షాకు కూడా… ఈ రేమండ్ పీటర్ నివేదికను ఇచ్చారు. అక్కడే… ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి పోలవరంపై నిపుణుల కమిటీ నివేదికను సమర్పించారు. అంతకు ముందు విజయసాయిరెడ్డిని పీఎంవో పిలిచి వివరణ అడిగినప్పుడూ అదే నివేదిక ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ ్ధారిటీ, కేంద్ర జలసంఘం గతంలో ఇచ్చిన నివేదికలకు అది పూర్తి భిన్నంగా ఉంది. దాంతో.., ప్రధానమంత్రి కార్యాలయం… వివరణ అడిగింది. జగన్, విజయసాయిరెడ్డి ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలపై పూర్తి వివరణ అడిగింది. ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నృపేంద్రమిశ్రా… ఈ మేరకు… ఆధారాలు కూడా అడగాలని.. కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు.

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో పోలవరంం ప్రాజెక్ట్ అధారిటీని నివేదికలో ఉన్న అంశాలపై కేంద్ర జలశక్తి కార్యదర్శి వివరణ కోరారు. వెంటనే… సీఎం జగన్… సమర్పించిన నివేదికపై పూర్తిస్థాయిలో వివరణ పంపించాలని ఏపీ జలవనరుల శాఖను పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఆదేశించింది. ఇది జరిగి చాలా కాలం అయింది. రేమండ్ పీటర్ నివేదికలో చెప్పిన ప్రతీ ఆంశానికి ప్రాతిపదిక, ఆధారం ఏమిటో చెప్పాలని అడిగితే… జగన్ సర్కార్ సైలెంటయింది. మూడో తేదీలోపు సమాధానం పంపాల్సి ఉన్నా పంపలేదు. మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు ప్రచారం జరుగుతోంది. పీటర్ కమిటీ నివేదికను అడ్డం పెట్టుకునే జగన్… పోలవరం పై ముందుకెళ్తున్నారు. ఇప్పుడా కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఆధారాలు లేకపోతే సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు… ఏపీ సర్కార్ కు ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close