ఇండియాలో ఉండాలంటే హిందీ నేర్చుకోవాల్సిందే అంటున్న అమిత్ షా

ఒకే దేశం – ఒకే భాష అంటూ.. హిందీపై అమిత్ షా… చేసిన వ్యాఖ్యలు …. హిందీ మినహా ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల్లో మంటలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ప్రజలందరూ విధిగా హిందీ నేర్చుకోవాలన్నట్లుగా ఆయన ..మాట్లాడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అవసరమని.. హిందీ దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా తేల్చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల భాష ఏదైనా ఉందంటే అది అత్యధికంగా మాట్లాడే హిందీ మాత్రమేనని తన చాయిస్ కూడా చెప్పేశారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలు గన్న ‘‘ఒకే దేశం, ఒకే భాష’’ నినాదాన్ని నిజం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అమిత్ షా ఇలా మాట్లాడగానే… అలా దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. దక్షిణాది నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే అధినే స్టాలిన్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దిదే ఊరుకునేది లేదని అమిత్ షాకు స్పష్టం చేశారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి కూడా ఖండించారు. హిందీని దక్షిణాదిలో తప్పని సరి చేయడాన్ని తమిళులు అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. రెండో సారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత… ఒకే నినాదం వినిపిస్తున్నారు. అందులో మొదటి వాక్యం ఒకే దేశం… రెండో వాక్యం.. మాత్రం సందర్భానికి తగ్గట్లుగా మారుతున్నారు. ఒకే ఎన్నిక, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా.. ఇలా… సందర్భాన్ని బట్టి.. అన్నీ ఒకటే ఉండాలని అంటున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు… భాష కూడా చేరింది. ఒకే దేశం – ఒకే భాష అని నినాదం ప్రారంభించారు.

మిగతా వాటి చోట్ల ఏమో కానీ.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం.. ఈ వ్యవహారం సెంటిమెట్ గా మారే ప్రమాదం ఉంది. బలవంతంగా హిందీని తమపై రుద్దుతున్నారని.. తమ మాతృభాషలు ప్రమాదంలో పడతాయని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందడం ఖాయం. రాజకీయ పార్టీలు ముందుకు వస్తే.. అవి పోరాటాలుగా మారుతాయి. సెంటిమెంట్ అస్త్రాలుగా మారుతాయి. ఇప్పటికే ఎన్నార్సీ పేరుతో అసోంలోని కొంత మంది పౌరులను.. పౌరసత్వం నిరూపించుకోవాలన్నట్లుగా ..త్వరలో.. హిందీ టెస్టులు పెట్టి… భారతీయులో కాదో … జాబితాలు రిలీజ్ చేసే పరిస్థితి వస్తుందన్న చర్చలు కూడా అప్పుడే సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close