బ‌తుక‌మ్మ సంబ‌రాల‌తో క‌విత మ‌ళ్లీ యాక్టివ్..!

పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రిగిన త‌రువాతి నుంచి రాజ‌కీయంగా యాక్టివ్ గా లేరు మాజీ ఎంపీ, ముఖ్య‌మంత్రి కుమార్తె కె. క‌విత‌. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఆ త‌రువాత‌, పార్టీ ఓట‌మిపై స‌మీక్ష కూడా ఆమె చెయ్య‌లేదు. చివ‌రికి, ఆ మ‌ధ్య తెరాస అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో కూడా ఆమె పాల్గొన‌లేదు. సొంత నియోజ‌క వ‌ర్గం నిజామాబాద్ వైపు క‌న్నెత్తి కూడా ఆమె చూడ‌లేదు! ఎమ్మెల్సీని చేసి కేబినెట్ క పంపిస్తార‌నే చ‌ర్చ కొన్నాళ్లు జ‌రిగితే, రాజ్య‌స‌భ‌కు పంపించాల‌నే సీఎం కేసీఆర్ ఉన్నార‌నే క‌థ‌నాలు వచ్చాయి. ఏదేమైనా ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఆమె కామ్ గా ఉంటున్నారు. పార్టీ త‌ర‌ఫున ఇంత‌వ‌ర‌కూ ఆమె మాట్లాడిందీ లేదు, మీడియా ముందుకొచ్చి స్పందించిందీ లేదు. ఇప్పుడు బ‌తుక‌మ్మ సంబ‌రాల‌ను జ‌న జాగృతి త‌ర‌ఫున నిర్వ‌హించేందుకు ఆమె సిద్ధ‌మౌతున్నారు.

చాన్నాళ్ల త‌రువాత ఓ మీడియా ప్ర‌క‌ట‌న‌లో క‌విత మాట్లాడుతూ… సెప్టెంబ‌ర్ 28 నుంచి బ‌తుక‌మ్మ సంబ‌రాలు ప్రారంభ‌మౌతాయ‌నీ, అక్టోబ‌ర్ 6న స‌ద్దుల బ‌తుక‌మ్మ‌ల‌తో ఈ సంబ‌రాలు ముగుస్తాయ‌న్నారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం మారిదిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో పండుగ జ‌రుగుతుంద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌తోపాటు, విదేశాల్లో కూడా బ‌తుక‌మ్మ సంబ‌రాలు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

బతుక‌మ్మ‌ల‌తో మ‌రోసారి యాక్టివ్ అవుతున్నారు క‌విత‌. అయితే, ఈ పండుగ‌కే ప‌రిమితం అవుతారా… ఆ త‌రువాత‌, రాజ‌కీయంగా కూడా క్రియాశీలంగా మారే ప్ర‌య‌త్నాలు చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ పండుగ విష‌యానికొస్తే… రాష్ట్రంలో భాజపా కూడా ఈ సంబ‌రాల‌కు సిద్ధ‌మౌతోంది. కేంద్ర మ‌హిళా మంత్రుల్ని అతిథులుగా రాష్ట్రానికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో వారున్నారు. బ‌తుక‌మ్మ‌ల సెంటిమెంట్ తెరాస‌కు రాజ‌కీయంగా బాగా క‌లిసొచ్చింది. అదే బాట‌లో భాజ‌పా కూడా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ఏడాది బ‌తుక‌మ్మ‌ల ఉత్స‌వాల‌ను ఘ‌నం నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం రాజ‌కీయంగా తెరాస‌కు అవ‌స‌ర‌మ‌నే చెప్పాలి. కాబ‌ట్టి, క‌విత మ‌రింత క్రియాశీలం కావాల్సిన అవ‌స‌రముంది. లోక్ స‌భ ఎన్నిక‌ల ఓట‌మి నుంచి ఇక‌నైనా తేరుకుంటారా, దీనికి కొన‌సాగింపుగా రాజ‌కీయంగా మ‌రింత క్రియాశీలం అవుతారా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close