కృష్ణంరాజును అవమానించిన దుర్గగుడి అధికారులు..!

భారతీయ జనతా పార్టీ నేత , కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ గుడిలో అవమానం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి అయినప్పటికీ.. ఆయనకు.. కనీస గౌరవం ఇవ్వడానికి .. ప్రోటోకాల్ ఇవ్వడానికి అధికారులెవరూ సిద్ధపడలేదు. కానీసం కానిస్టేబుల్స్ కూడా ఆయనను పట్టించుకోలేదు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనేందుకు ముందుగా సమాచారం ఇచ్చి మరీ కుటుంబంతో సహా.. కృష్ణంరాజు ఇంద్రకీలాద్రి వచ్చారు. అయితే.. ఒక్కరంటే… ఒక్క అధికారి కూడా.. పట్టించుకోలేదు. దాంతో.. ఆరో ఆయనే కుటుంబంతో సహా ఆరో అంతస్తుకు వెళ్లారు. సామాన్యభక్తులతోపాటు వెళ్లడంతో.. ఆయన తోపులాటలో.. పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పైకి ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పినప్పటికీ.. ఆయన వర్గాలు ఆయనకు ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు.

కుంకుమార్చన జరిగే ప్రదేశానికి వెళ్లడానికి కృష్ణంరాజు చాలా అవస్థలు పడ్డారు. పలుమార్లు ఆయాసంతో కూర్చుండిపోయారు. చివరికి అతి కష్టం మీద.. ఈవో కార్యాలయం పక్కన ఉన్న కుంకుమార్చన వద్దకు చేరుకున్నారు. కృష్ణంరాజును ఆలయ అధికారులు అంతగా ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. సాధారణ వైసీపీ నేత వస్తే.. సకల మర్యాదలు చేస్తున్న .. ఆలయ అధికారులు ఇతరులు వస్తే మాత్రం కనీస గౌరవం ఇవ్వడం లేదు. సామాన్య భక్తుల కోసం కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. కేవలం.. వైసీపీ నేతలు, వారి అనుచరుల కోసమే… దసరా ఉత్సవాలు జరుపుతున్నట్లుగా అధికారులు వ్యవహరించండం భక్తుల ఆగ్రహానికి కారణం అవుతోంది. కృష్ణంరాజు.. తాను ఆలయానికి వస్తున్నట్లుగా ముందస్తుగా సమాచారం పంపినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది.

బీజేపీ నేతలపై.. పాలక వర్గాలకు ఉన్న కోపంతో… తాము కృష్ణంరాజుకు ఎక్కడ అధికార మర్యాదలు చేస్తే.. పై అధికారులకు కోపం వస్తుందోనన్న ఉద్దేశంతో… దుర్గ గుడి అధికారులు కావాలనే పట్టించుకోలేదని చెబుతున్నారు. కృష్ణంరాజు బీజేపీ నేతగా కాకపోయినా.. ఆయన వృద్ధాప్యం, ఆనారోగ్యం కారణంగా అయినా.. ఆయనకు.. ఇబ్బందిలేకుండా.. అమ్మవారి దర్శనం చేయించాల్సి ఉంది. అదీ కూడా చేయకుండా.. కృష్ణంరాజును తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close