ఈ వైఫ‌ల్యాన్ని సోనియా గాంధీ అకౌంట్లో వేస్తారా..?

హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌లో భాజ‌పాకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ రావ‌డం ఖాయ‌మ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీగా కాంగ్రెస్ ఎక్క‌డా గ‌ట్టి పోటీని ఇవ్వ‌లేద‌నే అభిప్రాయ‌మే అన్ని మాధ్య‌మాల ద్వారా వినిపిస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ కి ఎందుకీ ప‌రిస్థితి వ‌చ్చింది? లోక్ స‌భ ఎన్నిక‌ల వైఫ‌ల్యం త‌రువాత ఎందుకింత‌గా డీలాప‌డుతోంది? ఆ రెండు రాష్ట్రాల్లో మోడీ హ‌వా ప్ర‌భావం ఎక్కువ ఉందా, కాంగ్రెస్ వైఫ‌ల్య‌మే భాజ‌పాకి ప్ల‌స్ పాయింట్ గా మారుతోందా..? ఇప్పుడు ఇలాంటి చ‌ర్చ మ‌ళ్లీ తెర మీదికి వ‌స్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో భాజ‌పా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ మొద‌ట్నుంచీ ప‌గ‌డ్బందీగానే ఉంది. రాజ‌కీయంగా, ఆర్థికంగా దెబ్బ‌తీయ‌డంతోపాటు… ఎన్నిక‌లు వ‌చ్చేనాటికి భాజ‌పా మాత్ర‌మే దిక్కు, దేశ‌మంతా మోడీ మోడీ అంటోంద‌నే హైప్ ని పెద్ద ఎత్తున క్రియేట్ చేశారు. వీటిలో ఏ ఒక్క వ్యూహాన్ని కాంగ్రెస్ స‌మ‌ర్థంగా తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చెయ్య‌లేక‌పోయింది.

ఈ పరిస్థితికి కార‌ణం కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం లోపం అనేది ముమ్మాటికీ వాస్త‌వం. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌రువాత డీలాప‌డ్డ పార్టీని తాను న‌డిపించ‌లేనంటూ రాహుల్ గాంధీ చేతులెత్తేయ‌డంతో మ‌రింత ప‌త‌నం మొద‌లైంది. నిజానికి, ఒక నాయ‌కుడిగా అలాంటి సంద‌ర్భంలో రాహుల్ బ‌లంగా నిల‌బ‌డాల్సింది. ఆయ‌న్ని బ‌తిమాలి విసుగుచెంది, చివ‌రికి సోనియా గాంధీకి పార్టీ ప‌గ్గాల‌ను క‌ట్ట‌బెట్టారు. ఆమె నాయ‌క‌త్వంలో జ‌రిగిన ఎన్నిక‌లు ఇవి. అంటే, రాబోయే‌ ఫ‌లితాలు ఎలా ఉన్నా అవి సోనియా గాంధీ నాయ‌క‌త్వం వైఫ‌ల్యంగానే చెప్పాల్సి ఉంటుంది. వ‌యోభారంతో క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని ప్ర‌శాంతంగా ఉందామ‌నుకున్న సోనియాని, బ‌ల‌వంతంగా తీసుకొచ్చి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆమెని తీసుకొస్తే చాలు, ప‌నైపోయింది అన్న‌ట్టుగానే కాంగ్రెస్ నాయ‌కులు వ్య‌వహ‌రించారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక‌మైన వ్యూహాలుగానీ, బ‌ల‌మైన పోటీని ఇచ్చే గ‌ట్టి ప్ర‌య‌త్నాలుగానీ కాంగ్రెస్ అధినాయ‌త్వం చెయ్య‌లేద‌ని విమ‌ర్శ‌లు మొద‌లైపోయాయి.

కాంగ్రెస్ పార్టీ తీరు చేస్తుంటే.. రానురాను గ‌త‌వైభ‌వాన్ని పూర్తిస్థాయిలో కోల్పోయే దిశ‌గా అడుగులు వేస్తోంది. దేశానికి స్వ‌తంత్రం తెచ్చిన పార్టీ, గాంధీ నెహ్రూలు ఒక‌ప్పుడు ఉన్న పార్టీ అంటూ చేసుకునే ప్ర‌చారానికి కాలం చెల్ల‌బోతున్న‌ట్టుగా ఉంది. ఇంకోప‌క్క‌.. భాజ‌పా కూడా ప‌టేల్ తోపాటు గాంధీ ఆద‌ర్శాల‌ను పుణికిపుచ్చుకున్న‌ది తాము మాత్ర‌మే అని ప్ర‌చారం చేసుకోవ‌డంలో స‌క్సెస్ అవుతున్నారు. ఇంత జ‌రుగుతున్నా కాంగ్రెస్ లో సంక్షోభం కుటుంబ సమ‌స్య‌గానే ఆ పార్టీ అధినాయ‌క‌త్వం చూస్తున్న‌ట్టుగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ప‌నితీరును ఆత్మ‌విమ‌ర్శ చేసుకున్నాక‌నైనా కాంగ్రెస్ తీరులో స‌మూల మార్పులు రావాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close