బీజేపీపై సాక్షి ఎడిటోరియల్ ఎటాక్..!

భారతీయ జనతా పార్టీతో వైసీపీ తెగిపోతున్న సంబంధాల ప్రభావం… ఆ పార్టీకి చెందిన మీడియాలో ప్రస్ఫుటమవుతోంది. ఆ పార్టీ నేతల కార్యక్రమాలకు అంతంత మాత్రం స్పేస్ ఇవ్వడం ఒకటైతే.. ఎడిటోరియల్ పేజీ సాక్షిగా.. బీజేపీ విధానాలపై దాడికి దిగుతూండటంతో.. మరొకటి. వార్తల కవరేజీ.. ఇచ్చినా ఇవ్వకపోయినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోరు.. బీజేపీకి కావాల్సినంత మీడియా సపోర్ట్ ఉంది. కానీ బీజేపీ విధనాలపై… ఎడిటోరియల్ పేజీలో తమకు మాత్రమే పరిమితమైన ప్రముఖులతో వరుసగా కథనాలు రాయిస్తూ.. బీజేపీపై వ్యతిరేకత పెంచే ప్రయత్నాన్ని ఓ రేంజ్‌లో.. సాక్షి చేస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్.. ఈ వారం.. బీజేపీ చరిత్రను మార్చాలనుకుంటోందని విమర్శిస్తూ.. ఓ సుదీర్ఘకమైన ఆర్టికల్ రాశారు.

ఇటీవలి కాలంలో బీజేపీ చరిత్రను తిరగాసే ప్రయత్నం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో… అమిత్ షా ఒకటి, రెండు సందర్భాల్లో.. చరిత్రలో జరిగిన వ్యవహారాలు వేరని.. మనం అనుకుంటున్న వేరని..నిజాలు బయటకు రావాల్సి ఉందన్న అర్థంలో మాట్లాడారు. దీన్ని పట్టుకునే ఏబీకే ప్రసాద్ తో సాక్షి యాజమాన్యం.. ఆయనను విమర్శిస్తూ.. ఆర్టికల్ రాయించంది. ఇందులో ఏబీకే ప్రసాద్… లోతుగా విశ్లేషణ చేశారు. చాలా మందికి ఆ విశ్లేషణ అర్థం కాకపోవచ్చు కానీ…భారతీయ జనతా పార్టీ ఏదో తప్పు చేస్తోందన్న భావన మాత్రం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ ఆర్టికల్ బాగా ఉపయోగపడుతుంది.

గతంలో కంచె ఐలయ్యతో.. మాత మార్పిళ్లకు అనుకూలంగా.. ఓ ఆర్టికల్ ప్రచురించి సాక్షి యాజమాన్యం.. తన ఉద్దేశం చెప్పకనే చెప్పింది. ఆరెస్సెస్ చెబుతున్నట్లుగా.. మత మార్పిళ్లు నేరం కాదని వాదించే ప్రయత్నం చేశారు. ఎడిటోరియల్ పేజీలో అభిప్రాయాలకు తమకు సంబంధం ఉండదని.. సాక్షి యాజమాన్యం చెప్పవచ్చు కానీ.. అందరి అభిప్రాయాలు అక్కడ ప్రచురించరు. తమకు ఏ అభిప్రాయాలు కావాలో.. వాటిని.. ఆస్థాన రచయితలుగా ఉన్న ప్రముఖులతో రాయించుకుని ప్రచురించడం సాక్షి నైజం. దీన్ని బీజేపీపై దాడులకు పకడ్బందీగా సాక్షి ఉపయోగించుకుంటోంది. జగన్ విధానాలను… తెరపైకి తెస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close