దుబాయ్‌లో సీఎం రమేష్ హంగామా..!

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు హైదరాబాద్‌లో ఉన్న ఇంటి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అందులో ఉన్న లగ్జరీస్ అలా ఉంటాయి మరి. ఇక నుంచి ఆయన ఇంటి గురించి చెప్పుకోరు. ఆయన కుమారుడి ఎంగేజ్‌మెంట్ ఎలా చేశారో చెప్పుకుంటారు. ఎందుకంటే… ఆ స్థాయిలో చేస్తున్నారు మరి. సీఎం రమేష్ కుమారుడ్ని.. అమెరికాకు చెందిన రాజా తాళ్లూరి అనే ప్రముఖ డాక్టర్ కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. నిశ్చితార్థాన్ని ఇరవై మూడో తేదీన పెట్టుకున్నారు. హైదరాబాద్‌లోనో… ఢిల్లీలోనో జైపూర్‌లోనో.. ప్రసిద్ధి పొందిన స్టార్ హోటల్స్‌లో .. సంపన్నులు చేస్తూ ఉంటారు. కానీ.. తన గురించి నలుగురు చెప్పుకునేలా చేయాలనుకున్న సీఎం రమేష్. అందుకే… గల్ఫ్ కంట్రీస్‌లో ఒకటైన రస్ అల్ ఖైమాలోని ఉన్న లగ్జరీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ.. మొత్తంగా 75 మంది ఎంపీలు నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్తున్నారు. కేంద్రమంత్రులు.. ఇతర ఉన్నతాధికారులు.. హై ప్రోఫైల్ మనుషుల సంగతి సరేసరి. ఇక… సీఎం రమేష్ చేసే ఏర్పాట్లతో కాకుండా.. సొంతంగా.. వెళ్లేవాళ్లూ ఉన్నారు. అందరికీ అక్కడ మూడు రోజుల పాటు రాచమర్యాదలు జరుగుతాయి. విమానాశ్రయంలో దిగినప్పటి నుండే.. వారికి మర్యాద రామన్నలు ఎదురొస్తారు. అడిగింది కాదనకుండా.. సమకూరుస్తారు.

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నేతలు దుబాయ్ పయనమవుతున్నారు. అయితే.. నిన్నామొన్నటి వరకూ.. తన బాస్ గా ఉన్న టీడీపీ అధినేతను… ఆ పార్టీలోని ముఖ్యలను ఆహ్వానించారో లేదో కానీ.. భారతీయ జనతా పార్టీకి చెందిన కొంత మంది ప్రముఖులికి మాత్రం ఆహ్వానం అందినట్లుగా చెబుతున్నారు. ఇంతా చేసి.. ఇదంతా నిశ్చితార్థం మాత్రమే. నిశ్చితార్థమే.. ఇంత హంగామా చేస్తూంటే.. పెళ్లి ఇంకెంత హంగామా చేస్తారోనన్న చర్చ సహజంగానే వస్తుంది. పెళ్లి ఎప్పుడు చేస్తారు..? ఎక్కడ చేస్తారు…? అన్న క్లారిటీ వచ్చిన తర్వాత… ఆ విశేషాలు బయటకు రావొచ్చు. అప్పటి వరకూ సీఎం రమేష్ లగ్జరీ నిశ్చితార్థం గురించి చెప్పుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close