“మహా”లో నేటి నుంచి “సర్కార్” రూల్..! కాని ఎంత కాలం..?

మహారాష్ట్ర రాజకీయాలను.. కనుసైగలతో.. శాసించిన బాల్ ధాకరే కుటుంబం .. తొలి సారి… ప్రత్యక్ష అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. కర్టూనిస్టు స్థాయి నుంచి కరుడుగట్టిన హిందూత్వ వాదిగా.. శివసేనను స్థాపించి మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ థాకరే ఓ శిఖరంగా నిలిచారు. దశాబ్దాలుగా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ధాకరే కుటుంబం పోటీ చేయదు. ఎలాంటి పదవులు అయినా శివసైనికులే.. పొందుతూ ఉంటారు. అయితే బాల్ థాకరే.. చేపడితే.. ముఖ్యమంత్రి పదవి మాత్రమే చేపట్టాలన్న లక్ష్యంతో ఉండేవారు. ఇప్పుడా లక్ష్యాన్ని.. ఆయన కుమారుడు ఉద్దవ్ థాకరే తీరుస్తున్నారు. నేడు ఉద్దవ్ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఓ రకంగా.. శివసేన రాజకీయాల్లో ఇది అత్యున్నత స్థితి.

మహా పీఠాన్ని .. సర్కార్ కుటుంబం అందుకునే దిశగా.. జరిగిన పరిణామాలు.. భవిష్యత్‌ను ఊహించలేకపోతున్నాయి. సిద్దాంతాల పునాదులను సైతం.. పెకిలించి.. ఇంత కాలం తాము ఎవరితో పోరాడామో.. వారితో కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా కలిసి ఉన్న.. బీజేపీని తృణప్రాయంగా పక్కన పెట్టేశారు. బీజేపీకి ఇది తాత్కాలికంగా.. నష్టం చేకూర్చవచ్చు కానీ.. మహారాష్ట్రలో సొంతంగా ఎదగాలనుకుంటున్న ఆ పార్టీకి.. గొప్ప అవకాశాన్ని.. శివసేన ఇచ్చింది. ఇప్పుడు.. మహారాష్ట్రంలో హిందూత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక్క బీజేపీనే నిలిచింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టడం ద్వారా శివసేన ఇక బలమైన .. హిందూత్వవాదాన్ని వినిపించే అవకాశం కోల్పోయింది.

అదే సమయంలో.. ఈ ప్రభుత్వం ఎంత కాలం మనుగడలో ఉంటుందన్నది మరో కీలకమైన అంశం. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగే వరకూ.. అంటే.. మహా అయితే.. ఏడాది, ఏడాదిన్నర మాత్రమే.. బీజేపీ సహనంగా ఉంటుంది. ఆ తర్వాత తన మార్క్ రాజకీయాలకు తెర తీస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అప్పటికి.. మూడు పార్టీల్లోని అసంతృప్తులను పోగేసి..మరోసారి “కర్ణాటక” ఫార్ములాను తెరపైకి తెస్తుందని అంటున్నారు. అదే జరిగితే.. మొత్తంగా నష్టపోయేది శివసేననే. తెలుగుదేశం పార్టీ ల్లాంటి వాటి అనుభవాలు చూసిన తర్వాత.. దీన్ని ఎవరూ కాదనలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close