అమరావతిలో టీడీపీ భారీ ఆఫీస్ రెడీ..!

ఘోరపరాజయం భారంలో ఉన్నప్పటికీ..భవిష్యత్‌పై.. ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ.. అమరావతిలో భారీ కార్యాలయాన్ని నిర్మించుకుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. దీన్ని అమరావతికి తరలించకతప్పలేదు. ఇప్పటికే అక్కడ ఉన్న జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా చేశారు. కానీ అది సరిపోవడం లేదు. అందుకే.. మంగళగిరి సమీపంలో.. నాలుగున్నర ఎకరాల్లో .. కార్యాలయాన్ని నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ లో నిర్మాణం ప్రారంభించారు. ఏడాదిలోనే ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆరో తేదీన.. ఈ వేడుక జరుగుతోంది. సరైన కార్యాలయం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే… సమస్యలు ఉండవని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బ్లాకులుగా నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కంటే 5 రెట్లు పెద్దది.

ఈ కార్యాలయం.. టీడీపీకి దక్కకుండా ఉండేందుకు… ఏపీ సర్కార్ అన్ని రకాల చర్యలు ప్రారంభించింది. టీడీపీ కార్యాలయాన్ని నిర్మించిన స్థలం… ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నది. ఆ లీజును.. క్యాన్సిల్ చేయడానికి అవసరమైన ప్రయత్నాలను.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రారంభించింది. రెవిన్యూ శాఖ ద్వారా నోటీసులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యాలయంలో కొంత స్థలం.. ప్రభుత్వ పోరంబోకు స్థలంలో ఆఫీసు కట్టారని.. అలాగే ప్రైవేటు రైతుల స్థలాన్ని ఆక్రమించి ఆ కార్యాలయం కడుతున్నారని… ఇప్పటికే రెవిన్యూ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పుడు ప్రభుత్వ స్థలం లీజును క్యాన్సిల్ చేసి.. వెనక్కి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే.. కేబినెట్ నిర్ణయం ప్రకారం.. టీడీపీకి లీజు కోసం స్థలం కేటాయించారు. మళ్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. స్థలం కేటాయించిన సమయంలో.. పెట్టిన నిబంధనలు అతిక్రమిస్తేనే.. వాటిని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. న్యాయస్థానంలో నిలబడవు. ఆ కోణంలో.. ఇప్పుడు ఏపీ అధికారులు.. టీడీపీ కార్యాలయం స్థలంలో నిబంధనలు ఏమైనా అతిక్రమించేరేమోనన్న ఉద్దేశంలో.. పరిశీలన జరుపుతున్నారు. ఈ కార్యాలయాన్ని ఎంతో కొంత వివాదాస్పదం చేయకుండా.. అయితే.. ఏపీ సర్కార్ వదిలి పెట్టే అవకాశం లేదని.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలతో తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close