జాతీయ మీడియా ప్రశ్న : హిందూపూర్ ఎంపీనీ ఎన్‌కౌంటర్ చేస్తారా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి జాతీయ స్థాయిలో హైలెట్ అయ్యారు. రేప్ చేసిన.. నలుగుర్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో… ప్రముఖుల విషయంలోనూ.. అలాంటి చర్య తీసుకోగలరా అన్న చర్చ దేశం మొత్తం ప్రారంభమమయింది. ఈ క్రమంలో మొదట మీడియా దృష్టి ప్రజాప్రతినిధులపై పడింది. ఎవరెవరిపై రేప్ కేసులున్నాయో బయటకు తీసింది. ఆశ్చర్యకరంగా.. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి.. గోరంట్ల మాధవ్ పేరు ఉంది. ఆయన పోలీసు శాఖలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తూ… రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో చేరి హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు.

పోలీసు అధికారిగా.. గోరంట్ల మాధవ్‌ది వివాదాస్పద చరిత్ర. ఓ కేసులో ఓ యువజంటను అదుపులోకి తీసుకున్న ఆయన.. ఆ జంటలోని మహిళతో.. అసభ్యంగా ప్రవర్తించారు. అత్యాచారం చేయబోయారని ఆ మహిళ కేసు పెట్టింది. ఆ కేసు విచారణలో ఉంది. అలాగే నోట్ల రద్దు సమయంలో.. ఓ సీనియర్ సిటీజన్ ను .. ఏటీఎం ముందు ఇష్టం వచ్చినట్లు బాదారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటనపైనా కేసు నమోదయింది. ఆ దాడి కేసు సంగతేమో కానీ.. ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన కేసు మాత్రం ఇప్పుడు తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో నలుగుర్ని ఎన్‌కౌంటర్ చేసినట్లుగా…రేప్ కేసులు ఉన్న ప్రజాప్రతినిధుల్ని కూడా ఎన్ కౌంటర్ చేస్తారా.. అని ప్రశ్నిస్తోంది. అందులో గోరంట్ల మాధవ్ పేరు కూడా ఉంది.

మామూలుగా అయితే.. తీవ్రమైన నేరాలున్న వారికి.. స్వచ్చంద పదవీ విరమణకు.. పోలీసు శాఖ అంగీకరించదు. వాటిపై విచారణ జరిగిన తర్వాత ఓ ప్రొసీజర్ ప్రకారం.. వెళ్లాల్సి ఉంటుంది. కానీ గోరంట్ల మాధవ్.. ఎన్నికల సమయంలో… కోర్టుకెళ్లారు. తన వీఆర్ఎస్‌ను ఆమోదించేలా ఆదేశించాలంటూ.. కోర్టుకు వెళ్లి.. అనుకూలమైన ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దాంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం అయింది. ఇప్పుడు.. ఆయనపై ఉన్న కేసులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close