ఆది సవాల్..! అమ్మతోడు.. నిరూపిస్తే ఉరేసుకుంటా..!

వైఎస్ వివేకా హత్య కేసులో.. సిట్ విచారణకు పిలిస్తే.. తాను ఆజ్ఞాతంలోకి వెళ్లానంటూ.. ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారంపై.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. వివేకా హత్య కేసులో సిట్ నుంచి.. తనకు ఇవ్వాళే నోటీసులు అందాయని.. గురువారం వారి ముందు విచారణకు హాజరవుతానని ప్రకటించారు. వివేకా హత్యకేసులో నా పాత్ర ఉందని నిరూపిస్తే… పులివెందుల నడిబొడ్డున ఉరివేసుకుంటానని ఆదినారాయణరెడ్డి సవాల్ చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు నిరూపించలేకపోతే.. ఏం చేసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

గతంలో.. సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన.. జగన్ తోపాటు.. వారి కుటుంబసభ్యులు ఇప్పుటు సిట్ విచారణ ను మాత్రమే ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. వాళ్లకు అనుకూలంగా ఉండేందుకే సిట్ విచారణ చేయిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు క్లూలను వదిలేసి.. రాజకీయంగా వచ్చిన ఆరోపణలతో… ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు పంపుతోందని..అంటున్నారు.

వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు… మొదట ఆత్మహత్య అన్న వైసీపీ నేతలు.. ఆ తర్వాత పోస్టు మార్టంలో హత్యగా తేలిన తర్వాత … ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబులపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇంత కాలం విచారణలో ఎక్కడా ఆదినారాయణ రెడ్డి పేరు రాలేదు. రాజకీయంగా మాత్రమే.. వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు సిట్ విచారణకు పిలిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close