ప‌వ‌న్ ఫ్యాన్స్ అన‌వ‌స‌రంగా కెలికేశారు

వ‌ర్మ కళ్లెప్పుడూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనే ఉంటాయి. ప‌వ‌న్‌నీ, అత‌ని ఫ్యాన్స్‌నీ ఎలా గిచ్చాలా అని చూస్తుంటాడు. కాస్త సందు దొరికితే చాలు – వ‌ర్మ విజృంభించేస్తుంటాడు. కోరి మ‌రీ త‌గ‌వు పెట్టుకుంటాడు. అలాంటిది ప‌వ‌న్ ఫ్యాన్స్ కెలికితే ఊరుకుంటాడా..? ఈమ‌ధ్య `వ‌ర్మ చ‌నిపోయాడు.. `అంటూ ఊర్ల‌లో ఫ్లెక్సీలు పెట్టేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌. వాటిని వ‌ర్మ త‌న ఫేస్‌బుక్‌లోనూ షేర్ చేసుకున్నాడు. దెయ్య‌మై మీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వెంటాడ‌తా అంటూ పోస్ట్ చేశాడు వ‌ర్మ‌.

ఇప్పుడు ప‌వ‌న్‌పై, అత‌ని ఫ్యాన్స్‌పై మ‌రింత క‌సి తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ప‌వ‌న్‌పై, జ‌నసేన పార్టీపై ఓ సెటైరిక‌ల్ సినిమా తీయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట వ‌ర్మ‌. అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి ఎందుకొచ్చాడు? వ‌చ్చి ఏం సాధించాడు? ప‌వ‌న్ ఐడియాల‌జీ ఏమిటీ? అనే విష‌యాల్ని వ్యంగ్యంగా చ‌ర్చించ‌బోతున్నాడ‌ట‌. `మ‌ట్టికుండ‌లో మ‌జ్జిగ‌న్నం` అనే పేరు ఇటీవ‌ల బాగా చక్క‌ర్లు కొట్టింది. అస‌లు దానికీ వ‌ర్మ‌కీ ఎలాంటి సంబంధం లేదు. కాక‌పోతే.. వ‌ర్మ కూడా అలాంటి టైటిల్ ఒక‌టి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. సో.. ఈసారి జ‌న‌సైనికులు మ‌రింత ప్రిపేర్డ్‌గా ఉండ‌డం అవ‌స‌రం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close