ఈ “ట్వంటీ- 20″కి హ్యాపీ కాదు బీపీనే..!

కొత్త శతాబ్దంలో మూడో దశాబ్దం ప్రారంభమవుతోంది. 2020 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశం.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలవబోతోంది. కచ్చితంగా జరుగుతాయని తెలుసు.. కానీ.. ఏం జరుగుతుందని తెలియకపోవడమే.. కొత్త ఏడాది విశిష్టత.

రాజధానిపై ఏపీ ప్రజలకు బీపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు.. ఊరూవాడా హాట్ టాపిక్.. రాజధాని అంశం. ఐదేళ్ల కాలంలో ఏపీ రాజధాని అమరావతి అని వచ్చిన ఓ గుర్తింపు.. ఉంటుందా.. ఊడుతుందా.. అనేది.. కొత్త ఏడాది… తొలి నెలలోనే తేలిపోనుంది. ప్రభుత్వ పట్టుదల ప్రకారం.. విశాఖకు రాజధాని తరలిపోవడం ఖాయమే. కానీ అమరావతి ఎప్పటికైనా ప్రజారాజధాని అంటున్న మిగతా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు.. చివరికి కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బీజేపీ కూడా … ఏపీ సర్కార్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది జనవరిలోనే తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఏడాదిలో ఇదే పెద్ద బీపీ.

కేటీఆర్ టీ..ట్వంటీ కెప్టెన్ అయిపోతారా..?

తెలంగాణలోనూ .. కొత్త ఏడాదికి బీపీనే ఉంది. కొత్త ఏడాదికి .. రాజకీయ పార్టీలు.. చాలా ఉద్రిక్తంగా స్వాగతం పలుకుతున్నాయి. దీనికి కారణం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడమే. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారనేది.. ఈ ఎన్నికల్లో అంత పెద్ద విషయం కాదు. కానీ ఫలితాల తర్వాత మాత్రం.. మేలిమలుపు రాజకీయాలు ఉంటాయన్న అంచనానే.. అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తోంది. అదే.. కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్యమైన విజయాలు సాధించడం ఖాయమనేది.. ఇప్పటికి మెజార్టీ రాజకీయ జనం ఒప్పుకునే అంశం. ఈ ఫలితాలు కేటీఆర్ దక్షతకు నిదర్శనమన్న సర్టిఫికెట్ ఇచ్చేసి.. ఆయనకు పట్టాభిషేకం చేస్తారనేది.. తెలంగాణ భవన్ ఇన్ సైడ్ టాక్.

ఆర్థిక మాంద్యం … దేశాన్ని ఓ ఆట ఆడేస్తుందా..?

ఆర్థిక మాంద్యం ప్రభావం ఇప్పుడు భారత్ పై ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోవడం ఆర్థిక మాంద్యానికి ఒక సంకేతం. చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే రాబోయేది గడ్డుకాలమే అని స్పష్టమవుతోంది. కొత్త ఏడాది ఈ సవాల్‌ను కేంద్రం అధిగమించాల్సి ఉది. ఈ దిశగా కేంద్రం సీరియస్‌గా అనేక చర్యలు తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై 105 లక్షల కోట్లను ఖర్చు పెడతామని.. కొత్త ప్రకటన.. నిర్మలా సీతారామన్ చేశారు. కేంద్రం తీసుకునే చర్యలు… సవాళ్లను అధిగమించేలా ఉంటాయా… లేదా అనేది.. కొత్త ఏడాదిలోనే తేలిపోనుంది. సక్సెస్ అయితేనే హ్యాపీ..లేకపోతే.. దేశ ప్రజలకు తప్పదు బీపీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close