రూ. 15వేలల్లో ఒక వెయ్యి మామయ్యకు..!

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు..ఇలా ఏ ఒక్క కుల కార్పొరే్షన్‌ను వదలకుండా.. ఖాళీ చేసి… అమ్మఒడికి నిధులను బదిలీ చేసిన ప్రభుత్వం.. పిల్లల తల్లులకు ఇస్తామన్న రూ. 15వేలలో ఒక వేయికి కోత పెట్టే ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకం ప్రారంభోత్సవ వేదిక మీదనే ప్రకటించారు. రూ. 15వేలలో రూ. 14వేలు మీరు ఉంచుకోండి.. రూ. ఒక్క వెయ్యి మాత్రం.. మావయ్యకు ఇచ్చానని అనుకోండి అని నేరుగా ప్రకటించారు. ఆ రూ. వెయ్యి.. బడి అభివృద్ధి కోసం కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. ఒక్కో తల్లికి ఇలా రూ. వెయ్యి తగ్గించి .. ఆ మొత్తాన్ని పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తామని జగన్ చెబుతున్నారు.

నిజానికి పాఠశాలల అభివృద్దికి జగన్మోహన్ రెడ్డి .. నిన్న – నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం మచేశారు. మొత్తంగా.. రాష్ట్రంలోని 47వేల స్కూళ్లలో నాడు-నేడు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ స్కూళ్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, అదనపు తరగతులు, ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు నిర్మించనున్నారు. నవంబర్ పధ్నాలుగో తేదీన ఈ పథకాన్ని జగన్ ప్రారంభించినప్పటికీ.. ఒక్కటంటే.. ఒక్క స్కూల్‌లోనూ.. పనులు ప్రారంభం కాలేదు. వివిధ కంపెనీల సీఎస్‌ఆర్ నిధులను.. కూడా.. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రభుత్వాధినేతకు సన్నిహితమైన కొన్ని కంపెనీలు విరాళాలు ఇచ్చాయి. అయితే.. అవి చాలా పరిమితం.

కనెక్ట్ టు ఆంధ్రా అనే మరో కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ పథకానికి కొన్ని వేల కోట్లు కావాల్సి ఉండటంతో.. నిధుల సేకరణ కష్టంగా మారింది. అందుకే.. అమ్మఒడి నుంచి ఒక్కో వెయ్యి వసూలు చేస్తే.. కొంత భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే.. సంక్షేమ నిధులు.. అమ్మఒడికి.. అమ్మఒడి నిధులు..నాడు -నేడు పథకానికి.. ఇలా రీసైకిల్ చేస్తున్నారన్నమాట..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close