మేయర్‌ పీఠం పై కర్చీఫ్‌ వేసి కూర్చున్న బొంతు!

గ్రేటర్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇప్పుడు మేయర్‌ పీఠం వరించబోయేది ఎవ్వరిని? అనే అంశం పార్టీలో కీలకంగా చర్చనీయాంశంగా ఉంది. ‘T360’ ముందే చెప్పినట్లుగా.. మేయర్‌ పీఠాన్ని పార్టీ విధేయులకు, ఉప మేయర్‌ పీఠాన్ని ఆంధ్రా సెటిలర్లలో ఒకరికి ఇవ్వడానికి సూత్రప్రాయంగా కేసీఆర్‌ అంగీకరించి ఉన్నట్లుగా సమాచారం. అయితే కీలకమైన మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం కోసం పార్టీలో చాలా కసరత్తులు జరుగుతున్నాయి. ఒకవైపు మహిళలకు కేసీఆర్‌ అవకాశం కల్పించే ఉద్దేశం ఉన్నదనే ప్రచారం ఉండగా.. ఇతరులు కూడా తమ ఆశలను వదలుకోవడం లేదు.

ఎన్నికలకు ముందునుంచి పార్టీ నాయకుడు బొంతు రామ్మోహన్‌ పేరు మేయర్‌ స్థానానికి ప్రాబబుల్‌గా బలంగా వినిపించింది. అయితే ఒక దశలో ఆయన పోటీచేస్తున్న డివిజన్‌లో పోటీ బలంగా ఉన్నదనే ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు సిటీ అంతా వెల్లువెత్తిన తెరాస హవాలో బొంతురామ్మోహన్‌ కూడా విజయం సాధించారు. ఆయన మేయర్‌ పీఠం మీద కర్చీఫ్‌ వేసిపెట్టి, పార్టీలో తనకు అవకాశం ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మేయర్‌ పీఠంపై తన ఆశలను దాచుకోవడానికి కూడా ఆయన ప్రయత్నించడంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికార నివాసం, దాన్ని చేరుకునే అన్ని మార్గాల్లోనూ బొంతు రామ్మోహన్‌ చాలా పెద్ద ఎత్తున హోర్డింగులను ఏర్పాటుచేశారు. అద్భుతమైన విజయం సాధించిన తెరాసకు, అధినేత కేసీఆర్‌, సారథ్యం వహించిన కేటీఆర్‌లకు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా తన ఫోటో కూడా పెట్టుకుని బొంతు రామ్మోహన్‌ తరఫున పెద్దసంఖ్యల్లో హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. సెక్రటేరియేట్‌ మార్గం, సీఎం క్యాంపు ఆఫీసు చేరుకునే అన్ని మార్గాల్లోనూ పెద్దసంఖ్యలో ఈ హోర్డింగులు ఉన్నాయి. అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఆయన తరఫు ముమ్మర ప్రయత్నంగా కనిపిస్తోంది.

అదే సమయంలో కేసీఆర్‌ మేయర్‌ పీఠాన్ని మహిళలకు కట్టబెడతారనే ప్రచారం కూడా పార్టీలో ఉంది. కేబినెట్‌లో ఆడవారికి చోటు కల్పించలేదు గనుక.. మహిళలంటే కేసీఆర్‌కు చిన్నచూపు అని, మహిళాద్వేషి అని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వాటిని తుడిచేయడానికి మేయర్‌ను మహిళ చేతిలో పెడతారనే ప్రచారం ఉంది. అదే నిజమైతే ఎవరిని ఎంచుకుంటారనేది కీలకం. పార్టీ ఎంపీ కేకేశవరావు కుమార్తెకు ఇది దక్కవచ్చునని కూడా ఒక ప్రచారం నడుస్తోంది. మహిళలకు అవకాశం అనే దృష్టితో చాలామంది మహిళా కార్పొరేటర్లు తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారో రెండు రోజుల్లో తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close