పవన్‌పైనే విమర్శలు..బీజేపీ జోలికి పోని వైసీపీ..!

భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులు పెట్టుకున్నాయి. రెండు పార్టీల నేతలూ.. ప్రెస్‌మీట్లో.. వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ.. వైసీపీ మాత్రం.. పవన్ కల్యాణ్‌ను అదే పనిగా.. ఇంకా చెప్పాలంటే.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది కానీ.. బీజేపీ జోలికి మాత్రం పోవడం లేదు. భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పని చేయాలని.. ఎలాంటి ఎన్నికలు వచ్చినా కలసి పోటీ చేయాలని.. నిర్ణయించుకోవడంతో.. పరిస్థితి మారిపోయిందని అనుకున్నారు. ఇంత కాలం.. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చిన.. వైసీపీ నేతలు ఇప్పుడు.. బీజేపీని కూడా విమర్శించాల్సి వస్తుందని రాజకీయవర్గాలు అంచనా వేఏశాయి. అయితే ఇందులోనూ.. వైసీపీ నేతలు.. ఓ లైన్ గీసుకున్నారు.

బీజేపీని చాలా అంటే.. చాలా పరిమితంగా.. టచ్ చేసి.. చేయనట్లుగా విమర్శలు చేసి.. పవన్ కల్యాణ్‌పై.. మాత్రం.. దారుణంగా విరుచుకుపడుతున్నారు. ఎక్కువగా కాపు సామాజికవర్గం నేతలతోనే ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నారు. గురువారమే అంబటి రాంబాబు.. పవన్ పై.. విరుచుకుపడగా.. శుక్రవారం.. ఆ జోరు మరింతగా పెరిగింది. గుడివాడ అమర్నాథ్, బాలినేని, సుధాకర్ బాబు వంటి నేతలు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి.. పవన్‌పై విమర్శలు గుప్పించారు. కానీ బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా..బీజేపీకి సుద్దులు చెబుతున్నారు. పవన్‌ని నమ్ముకోవడం అంటే.. కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదడమే లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

బీజేపీ నేతలు.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా.. స్పందించలేని నిస్సహాయ స్థితిని.. వైసీపీ మరోసారి బయట పెట్టుకుంటోంది. రాష్ట్ర అంశాలపై.. రాజకీయ విమర్శలు కూడా చేయలేని పరిస్థితిని వైసీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం.. బీజేపీ పెద్దల్ని వైసీపీ నేతలు ఎలా నిలదీయగలరనేది.. చాలా మందికి వస్తున్న సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close