రాంగ్ టైమ్ లో సినిమా మొద‌లెట్టిన ప‌వ‌న్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ మేక‌ప్ ఎప్పుడు వేసుకుంటాడా? అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఈరోజే ప‌వ‌న్ `పింక్‌` రీమేక్ మొద‌లైంది. ఓ ర‌కంగా ఈ ఘ‌డియ కోస‌మే అభిమానులు చూస్తున్నారు. చిత్ర‌సీమ‌కూ ప‌వ‌న్ శ‌క్తి తెలుసు. ప‌వ‌న్ సినిమా హిట్ట‌యితే బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో తెలుసు. అందుకే ప‌వ‌న్ రీ ఎంట్రీని చిత్ర‌సీమ కూడా స్వాగ‌తిస్తుంది. అభిమానులైతే సంబ‌రాలు చేసుకుంటున్నారు.

కానీ.. ప‌వ‌న్ రీ ఎంట్రీ రాంగ్ టైమ్‌లో జ‌రిగిందా? అనిపిస్తోందిప్పుడు. ఓ ప‌క్క ఆంధ్ర‌లో అమ‌రావ‌తి రైతులు రాజ‌ధాని విష‌యంలో రోడెక్కి ఉద్య‌మాలు చేస్తున్నారు. నిర‌స‌న‌లు, అరెస్టులూ ఊపందుకున్నాయి. అసెంబ్లీలో తీర్మాణాలు జ‌రుగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కూల్‌గా సెట్‌లోకి వెళ్లి `యాక్ష‌న్‌` చేసుకోవ‌డం కొంత‌మందికి న‌చ్చ‌డం లేదు. ప‌వ‌న్ సినిమాలు చేసుకోవ‌డంలో ఎవ్వ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. కానీ రాజ‌ధాని రైతుల‌కు వెన్నుద‌న్నుగా ఉంటాన‌న్న ప‌వ‌న్‌, స‌రిగ్గా వాళ్ల‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో వాలిపోవ‌డం, ఇక్క‌డ షూటింగులు చేసుకోవ‌డం కాస్త మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హార‌మే. ఈ విష‌యంలో పింక్ బృందం కాస్త అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించింది. ఓపెనింగ్‌కి మీడియాని దూరంగా పెట్టింది. ఎలాంటి ఆర్భాటాలూ చేయ‌కుండా కామ్‌గా క్లాప్ కొట్టేశారు. అయితే ప‌వ‌న్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో లీక‌య్యాయి. ఓ వైపు రాజ‌ధాని రైతులు రోడెక్కితే, ఈస‌మ‌యంలో ప‌వ‌న్ షూటింగులు చేసుకుంటున్నాడా? అంటూ చాలామంది విమ‌ర్శ‌ల దాడికి దిగుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close