దిల్‌రాజు మాట విన‌ని ద‌ర్శ‌కుడు

దిల్‌రాజు… ఓ అగ్ర నిర్మాత‌. ప‌రిశ్ర‌మ మొత్తానికి ఆయ‌న మాటంటే గురి. ఓ ర‌కంగా ప‌రిశ్ర‌మ‌ని శాశించే వ్య‌క్తుల్లో దిల్ రాజు పేరు మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. అగ్ర ద‌ర్శ‌కులు సైతం.. ఆయ‌న మాట‌కి ‘నో’ చెప్పే ఛాన్స్ లేదు. అయితే.. ఓ కొత్త ద‌ర్శ‌కుడు మాత్రం దిల్ రాజు మాట‌కి నో చెప్పాడు. ఆయ‌న చెప్పిన స‌ల‌హాలూ సూచ‌న‌లు పెడ చెవిన పెట్టాడు. తాను అనుకున్న‌దే తీశాడు. ఈ విష‌యాన్ని దిల్ రాజు సైతం మీడియా ముందు ప్ర‌స్తావించ‌డం విశేషం.

దిల్ రాజు నిర్మాత‌గా రూపుదిద్దుకున్న సినిమా ‘జానూ’. త‌మిళ 96కి ఇది రీమేక్‌. అక్క‌డ ఆ సినిమాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రేమ్ కుమార్ కే తెలుగు రీమేక్ బాధ్య‌త‌లు అప్పగించారు. అయితే త‌మిళ సినిమాకీ తెలుగు సినిమాకీ కొన్ని మార్పులు, చేర్పులూ ఉండాల‌ని దిల్ రాజు భావించాడు. ఓ పేప‌ర్ పై అవ‌న్నీ రాసి, ద‌ర్శ‌కుడి ముందు పెట్టాడు కూడా. కానీ… ద‌ర్శ‌కుడు వాటిని ప‌ట్టించుకోలేదు. తాను ఏదైతే అనుకున్నాడో అదే తీశాడు. ఈ విష‌యాన్ని దిల్ రాజు ఒప్పుకున్నారు. ”నేను కొన్ని మార్పులు చెప్పాను. అయితే అవేమీ ప్రేమ్ ప‌ట్టించుకోలేదు. తన మ‌న‌సులో ఈ క‌థ‌ని ఎలా తీయాల‌నుకున్నాడో అలానే తీశాడు. కేవ‌లం తెలుగు నేటివిటీకి సంబంధించిన మార్పులే జ‌రిగాయి. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి పాత్ర చాలా సైలెంట్‌గా ఉంటుంది. తక్కువ మాట్లాడ‌తాడు. కానీ.. శ‌ర్వానంద్ పాత్ర దాంతో పోలిస్తే కాస్త హుషారుగా ఉంటుంది. నేను చెప్పిన మార్పులు చేయ‌లేద‌ని ఎలాంటి కంప్లైంట్ లేదు. చివ‌రికి ప్రేమ్ నాకు న‌చ్చిన సినిమానే తీశాడ‌”న్నారు. అయితే ఈ ప్రేమ్ ఎవ‌రో కాదు.. ఇది వ‌ర‌కు తొలి అవ‌కాశం దిల్ రాజు బ్యాన‌ర్‌లోనే వ‌చ్చింది. ‘ఆర్య‌’ సినిమాకి ప్రేమ్ కుమార్ అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌ని చేశాడ‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close