ఆయనంతే..! చేసింది గాంధీ విగ్రహావిష్కరణ.. ఇచ్చింది చంద్రబాబును పాతేస్తామనే స్పీచ్..!

జగన్‌ను ఏమైనా అంటే చంపేస్తాం.. పాతేస్తాం.. పూడుస్తాం..! ఇవీ మంత్రి అనిల్… ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన హెచ్చరికలు. ఆయన స్వభావమే అలాంటిది కాబట్టి… అందులో వింతేముందని.. అనుకోవచ్చు కానీ.. ఈ హింసా వాది… అలాంటి మాటలు అన్న సందర్భమే విచిత్రం. ఆయన కర్నూలుజిల్లా నంద్యాలో .. అహింసా వాదంతో స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు. ఒక చెంపపై కొడితే.. మరో చెంప చూపించాలన్న విధానాన్ని పాటించిన మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అదే ఆయన ఆశయాలకు తానిస్తున్న గొప్ప గౌరవం అన్నట్లుగా మాట్లాడారు. తీరా విగ్రహావిష్కరణ చేసిన తర్వాత..తాను గాంధీ మహాత్ముడి చెంత ఉన్నానని.. అలాంటి మాటలు మాట్లాడకూడదని నియమం పెట్టుకోలేదు. తాను జగన్‌ భక్తుడినని.. ఆయన్ను ఏమైనా అంటే ఊరుకోనన్నారు. జగన్‌ మూడో నేత్రం తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతారంటూ హెచ్చరించారు. మంత్రి పదవి ఉంటుంది..ఊడుతుంది. దాని గురించి ఎప్పుడూ మేం భయపడం. కానీ జగన్‌ను ఏమైనా అంటే మాత్రం పాతేస్తామని హెచ్చరించారు.

రాజకీయ విమర్శలంటే.. వైసీపీ నేతలకు.. తిట్లు, బెదిరింపులే తప్ప.. విధానమైన అంశాలపై ఎప్పుడూ మాట్లాడరు. దానికి తగ్గట్లుగానే.. ఉన్నా… అసలు సమయం సందర్భం చూసుకోకుండా.. అనిల్ ఆవేశం ఎందుకో చాలా మందికి అర్థం కావడం లేదు. చంద్రబాబును ఎక్కడైనా తిట్టుకోవచ్చు… కానీ.. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించినందున.. కనీసం మహాత్ముడికైనా గౌరవం ఇవ్వాల్సింది కదా.. అనే చర్చ సామాన్యుల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close