ప‌వ‌న్‌… పాన్ ఇండియా ప్లాన్ మారిందా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. `విరూపాక్ష‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమాని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావించింది. వంద కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ అవుతుంద‌ని లెక్కేసింది. అయితే.. ఈ సినిమా ల‌క్ష్యం మారింది. పాన్ ఇండియా సినిమాగా దీన్ని చిత్ర‌బృందం భావించ‌డం లేద‌ట‌. తెలుగు సినిమాగానే తీయాల‌ని ఫిక్స్ అయ్యింద‌ని స‌మాచారం. తెలుగులో తీసి, మిగిలిన భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని భావిస్తోంది. హిందీ నాట కూడా డ‌బ్బింగ్ సినిమానే వెళ్తుంది. అక్క‌డ థియేట‌రిక‌ల్ రిలీజ్ ఉండ‌క‌పోవొచ్చు. పాన్ ఇండియా సినిమాలు ఈమ‌ధ్య బోల్తా ప‌డుతున్నాయి. హిందీ కోసం, మిగిలిన భాష‌ల కోసం క‌థ‌లో మార్పులు చేర్పులు చేసి, స్టార్ కాస్టింగ్‌ని తీసుకొచ్చి భంగ‌ప‌డుతున్నారు. దాని వ‌ల్ల బ‌డ్జెట్ పెరుగుతోంది త‌ప్ప‌, పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌డం లేదు. అందుకే ప‌వ‌న్ సినిమాని తెలుగు భాష‌కే ప‌రిమితం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌లున్నారు. అందులో ఒక‌ర్ని బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేద్దామ‌నుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచ‌న కూడా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close