చైతన్య : కరోనా కంటే “తప్పుడు ప్రచారమే” భయంకర వైరస్..!

కరోనా వైరస్ ఎంత భయంకరమో కానీ.. ఆ వైరస్ పేరుతో మీడియా, సోషల్ మీడియాల్లో జరుగుతున్న ప్రచారమే ఇంకా భయంకరంగా మారింది. ప్రజలందరి మనసుల్లో ఓ భయాన్ని నాటడంలో… సోషల్ మీడియా, మీడియా సక్సెస్ అయింది. వెల్లువలా వస్తున్న ఫేక్ వీడియోలు.. ఫేక్ వార్తలతో.. చివరికి గాలి పీల్చినా కరోనా వస్తుందేమో అన్న భయంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు.

జనం మనసుల్లో కరోనా భయం నింపేసిన మీడియా, సోషల్ మీడియా..!

కరోనా కంటే ఆ వైరస్‌పై జరుగుతున్న ప్రచారమే ప్రమాదకరంగా మారింది. కోవిడ్‌-19 ప్రమాదకరమైన వైరస్‌ అని ప్రచారం చేయడంతో.. అది సోకితే చచ్చిపోతారన్నట్లుగా ప్రచారం జరిగిపోయింది. ఎయిడ్స్ వచ్చిన వారినైనా కాస్త జాలిగా చూస్తున్నారేమో కానీ.. కరోనా వచ్చిన వారంటే.. వణికిపోతున్నారు. కరోనా వచ్చిన వ్యక్తి తమ కాలనీలో ఉంటే.. కాలనీ ఖాళీ అయిపోతోంది. ఎటూ వెళ్లలేని వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ప్రభుత్వం కూడా.. హడావుడి చేస్తోంది. స్కూళ్లు మూసేస్తోంది. శానిటేషన్ చేస్తోంది. ఇవన్నీ.. ప్రజల్లో కంగారు పెంచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వార్డును మా చుట్టు పక్కల ఉంచొద్దంటూ పద్మారావ్‌ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం.. అనేక రకాలుగా ప్రచారం జరుగడమే.

పాత వీడియోలతో కరోనా విలయం అంటూ ఫేక్ పోస్టులు..!

ఈ అనవసర ప్రచారాలకు వ్యాపారాలు మూత పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్క కేసు నమోదైందని చెప్పడంతో.. బస్సులు, మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కరోనా వాడికి వచ్చింది.. వీడికి వచ్చిందంటూ పుకార్లు ఆ భయాన్ని మరింత పెంచుతున్నాయి. చైనాలో ఒకడు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారంటూ ఓ వీడియో హల్‌ చల్‌ చేసింది. ఓ వ్యక్తి ఉమ్మి.. దానిని లిఫ్ట్‌ బటన్లకు రుదుతూ కనిపించే విజువల్స్‌ సంచలనంగా మారాయి. అసలు అవన్నీ ఇప్పటి వీడియోలు కాదు.. ఐదేళ్ల కిందటి వీడియోలను ఏదో సందర్భంలో రికార్డయిన వీడియోలను.. ఇలా సర్క్యూలేట్ చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారికే..ఇండియాలో ఒక్కరికీ సోకలేదు..!

భారత్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిజానికి దేశంలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. ఇటలీ, దుబాయ్‌ నుంచి వచ్చిన కొందరికి మాత్రమే కరోనా ఉంది. అక్కడే వారికి ఆ వైరస్ సోకింది. వారి నుంచి ఎవరికీ విస్తరించలేదు. వారి నుంచి మరొకరికి విస్తరించినా .. భారత్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కరోనా వ్యాప్తి కంటే.. ఈ పుకార్లు. అసత్యాల వ్యాప్తినే పెద్ద వైరస్‌గా మారింది. కట్టడి చేయకపోతే భారీ నష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close