ఎలక్షన్ కోడ్.. ఏపీ ప్రజలకు శాపం..!

కారణాలు ఏవైనా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పటి వరకు అన్నదానిపై క్లారిటీ లేదు. ఇప్పటికి నాలుగు వారాలు అని ఎస్‌ఈసీ చెబుతోంది కానీ.. కరోనా కట్టడి అయిన తర్వాతే.. ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు వాయిదానే వేశారు కాబట్టి.. ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. అంటే.. ప్రభుత్వం చాలా పరిమితులకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభ పెట్టే ఏ కార్యక్రమమూ చేపట్టకూడదు. అందుకే.. కొత్తగా ప్రభుత్వ పథకాల పంపిణీని నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఇందులో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా ఉంది.

ఉగాది రోజుల ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. అదే సమయంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండేలా.. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతోనే ప్రభుత్వ చిత్తశుద్ధిపై సందేహాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే… ఇళ్ల స్థలాల పంపిణీ వద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగి ఉంటే… కనీసం.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అయినా.. ఇళ్ల పట్టాల పంపిణీ జరిగి ఉండేది. కానీ.. ఇప్పుడు.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది. దానితో పాటు అనేక పథకాలు.. నిలిచిపోనున్నాయి. పించన్లు, రేషన్ బియ్యం వంటి.. పాత పథకాలు మాత్రం.. యథావిధిగా కొనసాగుతాయి.

ప్రభుత్వం .. స్వేచ్చగా పని చేయడానికి లేదు. ఎన్నికల కోడ్ ను పట్టించుకోకుండా.. అన్ని పనులు చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్నా… అధికారులు సందేహించే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు… ఏ పని చేసినా.. నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అసలు ప్రభుత్వం చెప్పినపని చేయడం కన్నా… ఈసీ చెప్పిన పనే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈసీకి, ప్రభుత్వానికి మధ్య పొసగని పరస్థితి ఏర్పడింది. తన ఆదేశాలు పాటించడం లేదని.. ఎస్‌ఈసీ కోర్టుకు వెళ్తే.. అధికారులకే మొదట ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి.

ఎన్నికల కోడ్ ను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా తొలగించాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. అయితే.. కోడ్‌ను తొలగించాలంటే.. ఎన్నికలను రద్దు చేయాలి. అలా చేస్తేనే.. కోడ్ రద్దవుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినందున.. ఎప్పుడు జరిగినా.. అప్పటి వరకూ కోడ్ అమల్లో ఉంటుంది. అందుకే.. ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలనే డిమాండ్ … ఒక్క పాలక పక్షం వైపు నుంచి కాకుండా.. అన్ని పార్టీల నుంచి వస్తోంది. ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం దాడులు కూడా జరిగాయని.. వాటిని పరిగణనలోకి ప్రక్రియ రద్దు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. ఎన్నికల ప్రక్రియ రద్దు అయితే.. కోడ్ పోతుంది. కోడ్ ఉంటే.. ప్రభుత్వం పని చేయలేదు… ప్రజలకు కష్టాలు తీరవు. కరోనా వల్ల ఏపీకి పెద్ద కష్టమే వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close