బెజవాడలో కరోనా..! కర్ఫ్యూ కంటిన్యూ..!

కరోనాని కంట్రోల్ చేయడానికి జనతా కర్ఫ్యూని విజయవాడలో కొనసాగించబోతున్నారు. తొలి సారిగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. దీంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం.. జనతా కర్ఫ్యూను మరో మూడు రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించుకుంది. అలాగే.. ఏప్రిల్‌ 14వరకు 144 సెక్షన్‌ అమలు చేయాలన ినిర్ణయించారు. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. జనతా కర్ఫ్యూ సందర్బగా విజయవాడ మొత్తం నిర్మానుష్యంగా మారింది. ప్రజలెవరూ రోడ్ల మీదకు రాలేదు.

విదేశాల నుంచి వచ్చిన వారిని .. పట్టుకోవడం.. ఏపీ అధికారయంత్రాంగానికి పెద్ద సమస్యగా మారింది. అలాంటి వారి ఆచూకీ తెలుసుకుని..వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే.. తక్షణం.. ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడంతో సమస్య పరిష్కారం కావడంలేదు. ఇప్పటికే వారు.. కుటుంబంతోనూ ఇతరులతోనూ సన్నిహితంగా మెలిగి ఉంటారు. దాంతో.. వారందర్నీ కూడా.. క్వారంటైన్ సెంటర్లకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుతం విజయవాడలో ఓ రకమైన భయానక పరిస్థితి ఏర్పడింది.

చాలా వరకూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడమో.. సెలవులు ప్రకటించడమో చేశాయి. ఓ మాదిరి ఉద్యోగులకు ఇబ్బంది లేకపోయినా… రోజు కలీలు.., చిరు వ్యాపారులు… తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి కోసం.. నిత్యావసర వస్తువులు అయినా పంపిణీ చేయాలన్న అభిప్రాయం అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం ఈ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందో లేదో మాత్రం.. ఎవరికీ తెలియడం లేదు. కర్ఫ్యూను మరికొంత కాలం పొడిగిస్తే… అన్ని వర్గాల ప్రజలు.. నిత్యావసరాల కోసం ఇబ్బందిపడే పరిస్థితులు ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close