అమరావతి పోరుకు వంద రోజులు..!

అమరావతి రైతుల పోరాటానికి వంద రోజులు అయ్యాయి. పోలీసులు లాఠీలతో విరుచుకుపడినా వెనక్కి తగ్గని రైతులు… కరోనా విజృంభిస్తున్నా… నిబంధనలకు అనుగుణంగా నిరసనలు తెలియచేస్తూ… పట్టుదల ప్రదర్శిస్తున్నారు. వంద రోజుల కిందట.. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చినప్పటి నుండి రైతులు.. పోరుబాట పట్టారు. పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలను తిన్నారు. కేసుల పాలయ్యారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. రాజధాని ఉద్యమంలో పాల్గొన్న.. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది జైళ్లకు వెళ్లారు. అయినా… ఎవరూ వెనక్కి తగ్గలేదు.

ప్రభుత్వం రైతుల్ని అసలు రైతులుగా పరిగణించకపోవడంతోనే సమస్య వచ్చింది. రాజధానికి భూములివ్వడమే వారి తప్పు అని.. అనుభవించాల్సిందేనన్నట్లుగా పరిస్థితి మారింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నా ప్రభుత్వం మాత్రం మారడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అమరావతిలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడెప్పుడు విశాఖ వెళ్లిపోదామా అని చూస్తున్నారు. ఇంత కరోనా కాలంలోనూ.. మే 22 తేదీకి విశాఖ వెళ్లిపోవాలని.. ఆయన అధికార యంత్రాంగానికి డెడ్ లైన్ విధించారన్న ప్రచారం జరుగుతోంది. రైతుల గురించి మాత్రం.. ఆలోచించడం లేదు. తరలింపు ఎజెండాతోనే ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

రాజధాని రైతులు.. పోరాటం ఆగదని నిరూపించడానికి తమ వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. కరోనా కారణంగా.. శిబిరాలు ఎత్తేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో ఉన్న దాని ప్రకారం.. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ… నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ విశ్రమించబోమని చెబుతున్నారు. మరో వైపు న్యాయపోరాటంోల మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కర్నూలుకు కార్యాలయాలు తరలించాలన్న జీవోపై హైకోర్టులో పిటిషన్ వేసి.. స్టే తీ సుకు రాగలిగారు. మరికొన్ని కీలక పిటిషన్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఎంత పోరాటం చేసి అయినా సరే.. రాజధాని అమరావతిలో ఉండేలా కాపాడుకుంటామని వారు ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close