శ్రీ‌నువైట్ల‌, కోన.. ఒక్క‌ట‌వుతున్నారా?

శ్రీ‌నువైట్ల, కోన వెంక‌ట్‌ల‌ది సూప‌ర్ హిట్ జోడీ. వీరిద్ద‌రూ క‌లిసి ప‌నిచేసిన సినిమాల‌న్నీ బాగా ఆడాయి. అయితే… వీళ్ల మధ్య క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్ రావ‌డంతో విడిపోయారు. ఓ ద‌శ‌లో `నువ్వెంత‌, అంటే నువ్వెంత‌` అనుకునే స్థాయిలో మాటా మాటా పెంచుకున్నారు. రాజ‌కీయాల్లోలానే సినిమా ప‌రిశ్ర‌మ‌లోనూ శాశ్వ‌త శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌రు. సో.. `బ్రూస్లీ`కి మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేశారు. ఆ త‌ర‌వాత ష‌రా మామూలే. ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి పనిచేసే ఛాన్సుంద‌ని టాక్‌.

`శ్రీ‌నువైట్ల‌తో నాకు ప‌నిచేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌ర‌మూ లేదు` అని ఇది వ‌ర‌కే కోన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. సో.. ఇటు శ్రీ‌నువైట్ల నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్సూ లేవు. పైగా శ్రీ‌నువైట్ల ఇప్పుడు విజ‌యాల నిరీక్ష‌ణ‌లో ఉన్నాడు. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` త‌ర‌వాత‌.. మ‌ళ్లీ నిల‌బ‌డాలంటే.. గ‌ట్టి హిట్టు ప‌డాల్సిందే. త‌న దృష్టి ఇప్పుడు `ఢీ 2` ప్రాజెక్టుపై ఉంది. ఈ సినిమాని మంచు విష్ణుతో తీయ‌బోతున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఓ స్టార్ హీరోతోనే ఢీ 2 ప‌ట్టాలెక్కుతుంద‌ని టాక్‌. ఢీతోనే శ్రీ‌నువైట్ల‌, కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌ల మ్యాజిక్ మొద‌లైంది. ఇప్పుడు దానికి సీక్వెల్ తో ఈ స్నేహ బంధానికి మ‌రోసారి శ్రీ‌కారం చుట్టాల‌ని ఈ పాత మిత్రులు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అన్న‌ట్టు.. ఈ రోజుతో ఢీ విడుద‌లై 13 ఏళ్లు. మ‌రి ఢీ 2కి ముహూర్తం ఎప్పుడు పెడ‌తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close