సుప్రీం సినిమాలో మరో మెగా హీరో

సాయి ధరం తేజ్ హీరోగా ‘పటాస్’ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సుప్రీం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబడుతుంది. ఈ సినిమాలో సాయితో పాటుగా మరో మెగా హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇంతకీ సాయి ధరం తేజ్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న మరో మెగా హీరో ఎవరంటే.. ఆయనే అల్లు వారి రెండో వారసుడు అల్లు శిరీష్.

సినిమా చివరలో అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలో కనిపించనున్నాడట అల్లు శిరీష్. ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ మీద కనబడితే ఇక మెగా అభిమానులను ఆపడం ఎవరి వల్లా కాదు. ప్రస్తుతం ఈ సన్నివేశాలను షూట్ చేసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్. ఇక అల్లు శిరీష్ తాను హీరోగా పరశురాం దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

సుప్రీం విషాయానికొస్తే.. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హాట్ గాళ్ ఇషా చావ్లా ఓ ఐటం సాంగ్ లో నరిస్తుంది. దిల్ రాజు ఎంతో శ్రద్ధతో నిర్మిస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం చివరి దశకు వచ్చిన ఈ సినిమా షూటింగ్ త్వరలో గుమ్మడికాయ కొట్టేయనున్నారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close