ఆపరేషన్ హాట్ స్పాట్స్..! కేసీఆర్ కొత్త ప్లాన్..!

తెలంగాణ సర్కార్.. ఈ నెలాఖరు కల్లా కరోనా ఫ్రీ స్టేట్‌గా చేద్దామని కంకణం కట్టుకుంది. దానికి తగ్గట్లుగా పూర్తిగా వైరస్ పైనే దృష్టి పెట్టి అధికార యంత్రాంగం అంతా పని చేస్తోంది. కానీ కొన్ని కొన్ని చోట్ల… అధికారులు చేసిన తప్పుల కారణంగా… సామాజిక వ్యాప్తికి దారి తీసింది. ఇలాంటి వాటిలో ఒకటి సూర్యాపేట. గద్వాల, వికారాబాద్‌లలోనూ వైరస్ సామాజిక వ్యాప్తికి దారి తీసిందనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సమస్య అక్కడ ఉద్భవించిందని భావిస్తున్న తెలంగాణ సర్కార్… దిద్దుబాటుచర్యలు తీసుకుంది. సీఎస్, డీజీపీలను అక్కడ పర్యటించాలని ఆదేశించింది. దీంతో వారు…మొదటగా సూర్యాపేటకు వెళ్లి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హెలికాఫ్టర్ ద్వారా.. అన్ని హాట్ స్పాట్లకు వెళ్లి అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వదిలించే ప్రయత్నం చేయనున్నారు.

సూర్యాపేటలో ఒక్కరి ద్వారానే వైరస్ విపరీతంగా వ్యాపించింది. ఇప్పుడు పట్టణం మొత్తం పాకిపోయింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. అక్కడి డీఎంహెచ్‌వో నిర్లక్ష్యంగా వ్వహరించడంతో… పరిస్థితి చేయిదాటిపోయిందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. డీఎంహెచ్‌వోను తొలగించి కొత్త అధికారిని నియమించారు. కరోనా వ్యాప్తి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళనగాఉన్నారు. అంతకంతకూ వ్యాపించడం వల్ల.. తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళనగా ఉన్నారు. అందుకే.. ప్రతీ రోజూ సమీక్షలు చేస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో పధ్నాలుగు రోజులు క్వారంటైన్ పూర్తయిన వారికి.. ఇరవై రోజుల తర్వాత కూడా పాజిటివ్ కేసులు వస్తూండటంతో… వైరస్ బలంగా మారుతోందని.. కేసీఆర్ అంచనాకు వేశారు. దీంతో.. క్వారంటైన్ గడువును… 28రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హాట్ స్పాట్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మరి ఏ ఇతర కార్యక్రమం పెట్టుకోకుండా.. పూర్తి స్థాయిలో కరోనాను అంతం చేయడంపైనే కేసీఆర్ దృష్టి సారించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close