మద్యం డోర్ డెలివరీ పరిశీలించాలని “సుప్రీం” సలహా..!

కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాల్ని ప్రారంభించాయి. మద్యం దుకాణాల దగ్గర ఎవరూ.. భౌతిక దూరం..మాస్కులు లాంటివి పెట్టుకోకుండానే… గుంపులు, గుంపులుగా మద్యం కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో మద్యం అమ్మకాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని.. తక్షణం మద్యం అమ్మకాల్ని నిలిపివేయాలని కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు డోర్ డెలివరీ సలహా ఇచ్చింది. భౌతికదూరం అమలు చేసేందుకు డోర్‌ డెలివరీని పరిశీలించాలని సూచించింది.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారని.. సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కరోనా వైరస్ కారణంగా అన్ని రాష్ట్రాల్లో నలభై రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డాయి. చివరికి కేంద్రం… నలబై రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం అనుమతించిన ఒక్క రోజేనే మెజార్టీ రాష్ట్రాలు అమ్మకాలు ప్రారంభించాయి.

నలభై రోజుల తర్వాత అమ్మకాలు ప్రారంభించడంతో.. మొదటి రోజు.. అందరూ ఎగబడ్డారు కానీ… తర్వాత చాలా చోట్ల మామూలుగానే పరిస్థితి మారింది. వందల మంది ఏమీ దుకాణాల ముందు ఉండటం లేదు. అయితే.. తొలి రోజుల్లో రష్ చూసిన తర్వాత పిటిషనర్లు కోర్టుల్లో కేసు వేసి ఉంటారు. డోర్ డెలివరి సలహా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి… అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్రాల నిర్ణయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close